తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీరుపై.. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈరోజు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ పై సంచలనమైన కామెంట్ చేయటం జరిగింది. దీంతో తెలంగాణలో వివిధ పార్టీలో రాజకీయ నేతలు సైతం షాక్ తిన్నారు. ‘‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ’’అన్నవిదంగా.. రేవంత్ రెడ్డి సీఎం కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.
టిడిపి రెబల్ ఎమ్మెల్యే గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి, పొదునైన మాటలతో రాజకీయ శత్రువులపై విరుచుకుపడ్డారు. ఒకేసారి కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని , టీఆర్ఎస్ పార్టీలోనే నేతలను కలిపి ఒకే కామెంట్ చేయటం జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ఉన్నప్పుడు ఒక్క కెవిపితోనే.. రాజకీయాలు నడపటం మనం చూసాం. ఆయన ఒక్క కేవిని సృష్టించి రాష్ట్రాన్ని నాశనం చేసిన విషయం అందరికి తెలిసిందే.
అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం ఒకేసారి ఆరుగురు కెపిపీలను సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అసలు టీఆర్ఎస్ అంటే మీకు తెలుసా? ‘‘ టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదట... , తెలంగాణ రావుల సమితిగా మారిందని ’’ రేవంత్ రెడ్డి నిజాన్ని బయట పెట్టారు. ఇప్పుడు కేసిఆర్ సృష్టించిన ఆరుగురు కేవిపిలు రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ ధరలు విపరీతంగా కంపెనీలు పెంచితే.. కేసిఆర్ ప్రభుత్వం చాలా సైలెంట్ గా ఉంది. అంతేకాకుండా. సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై , ఆదాయం పంచుకున్నారు. అయితే ఈ ఆరుగురు కేవిపిలు కలిసి బిల్డర్ల పై ఒత్తిడి పెంచి , సిమెంట్ కంపెనీలు పెంచిన ధరలకు ఒప్పించటం జరిగింది రేవంత్ రెడ్డి ఆరోపించారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వెనుక ఉన్న ‘‘రావుల’’ రహస్యాన్ని త్వరలో బయటపెడతామని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more