ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత రాష్ట్రానికే నష్టం అని మాజీ పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ అంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు సత్తిబాబు ఓ ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. బాబుగారు.. మీరు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలను, కొత్త పెట్టుబడులను ఆకర్షించించే పనిలో చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారని సత్తిబాబు అంటున్నారు. అయితే చంద్రబాబు కొన్ని విషయలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇతర ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో మాట్లాడే సమయంలో.. రాష్ట్రంలో ఉండే అస్తవ్యస్త పరిస్థితులపై క్లుప్తంగా మాట్లాడరాదని బాబు సత్తిబాబు సలహా ఇవ్వటం జరిగింది.
బాబు గారు మీరు ఎక్కువుగా మాట్లాడం, కాంగ్రెస్ పార్టీ పై నిందలు వేయటంతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోతాయని సత్తిబాబు అంటున్నారు. ఏమైన కాంగ్రెస్ పాలనలో దుర్మార్గ చర్యలు, అవకతవకలు ఏమైనా జరిగి ఉంటే వాటి గురించి ఎంత తక్కువుగా మాట్లాడితే.. రాష్ట్రానికి అంత మంచిదని సత్తిబాబు, బాబుకు హిత బోధ చేయటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే నష్టపోయిన విషయం అందరికి తెలుసు. చంద్రబాబు ప్రభుత్వమైన నష్టపోకుండా మంచి పాలన అందించాలని సత్తిబాబు చంద్రబాబును కోరుతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఒక్కొక్క రంగంలో ఆంద్రప్రదేశ్ ఎలా సర్వనాశనం అయిందో శ్వేతపత్రాల్లో వివరంగా వివరించారు. అయితే ఇలాంటి వివరాలు బయటపెడితే .. రాష్ట్రానికి మరీ కష్ట కాలం వస్తుందని సత్తిబాబు అంటున్నారు. రాజకీయంగా ఎన్నికల్లో సత్తిబాబు ఓడిపోయినప్పటికి చంద్రబాబు ప్రభుత్వంలో.. ఆంద్రప్రదేశ్ అభివృద్ది చెందాలని కోరుకోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని టిడిపి సినియర్ నేతలు అంటున్నారు. అంతేలే సోనియా గాంధీ దెబ్బతో సత్తిబాబు రాజకీయానికి గాయం అయింది కదా..అది మానే వరకు.. ఇలాంటి చల్లని సలహాలు చంద్రబాబు ఇస్తూ.. సత్తిబాబు ఐదేళ్లు కాలం గడపాల్సిందేనని ఆయన అభిమానులు అంటున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు కరుణిస్తే.. సత్తిబాబుకు మళ్లీ మంచి రోజులు వస్తాయని సైకిల్ పార్టీలోనే సినియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more