వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి, టాలీవుడ్ నటుడు నాగార్జునకు మిత్ర సంబందాలు ఉన్న విషయం తెలిసిందే. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయం నుంచే అక్కినేని నాగార్జునకు మంచి సన్నిహిత సంబందాలు ఉన్నట్లు రాజకీయ నాయకులు అంటున్నారు. వైఎస్ జగన్ 16 నెలల పాటు జైల్లో ఉంటే.. అనేక సార్లు నాగ్..చంచల్ గూడా జైలుకి వెళ్లి పలకరించినట్లు అప్పట్లో టిడిపి నేతలు ఆరోపించారు. నాగ్ చెబుతున్న మాటల ప్రకారం.. ‘‘మా టివి బిజినెస్ పార్ట్నర్ నిమ్మగడ్డ ప్రసాద్ జైల్లో ఉన్నాడు కాబట్టి, ఆయన్ని కలవటానికి వెళ్లిరావటం జరిగిందని అనేక సార్లు మీడియా ముందు నాగ్ చెప్పటం జరిగింది.
అయితే జైల్ లోపలికి వెళ్లిన నాగ్ మాత్రం నిమ్మగడ్డతో పాటు.. వైఎస్ జగన్ ను కలిసినట్లు అప్పట్లో టిడిపి వార్తలు వచ్చాయి. కానీ జగన్ కు నాగ్ ల మద్య వారదిగా..నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అయితే ఇటీవల అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఆస్తి పై తెలంగాణ ముఖ్యమంత్రి సర్కార్ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున కు సంబందించిన ఫంక్షన్ హాల్ ను కూల్చివేస్తున్నారని, మీడియాలో, పేపర్లో న్యూస్ హల్ చల్ చేసింది.
ఆ సమయంలో నాగ్ తన ఆస్తిని కాపాడుకోవటానికి కనిపించిన, పరిచయం ఉన్న ప్రతి రాజకీయ నేత వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి చెప్పిన.. అందరు నాగ్ ముఖంపైనే నో అని చెప్పినట్లు టాలీవుడ్. ఎలాగైన ఆస్తిని కాపాడుకోవాలని ప్రయత్నించే సమయంలో.. వైఎస్ జగన్ వద్దకు వెళ్లి నాగ్ సాయం చేయని అడిగిన వెంటనే.. జగన్ చేస్తానని చెప్పి, టీఆర్ఎస్ నేతలతో..గంటల తరబడి మాట్లాడి ..చివరకు జగన్ కూడా చేతులెత్తిస్తాడు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ పరిస్థితుల్లో నీకు ఎలాంటి సాయం చేయలేనని నాగ్ చెప్పినట్లు తెలంగాణ రాజకీయ నాయకులు అంటున్నారు.
అయితే నాగ్ చివరి అస్త్రంగా కోర్టు మెట్లు ఎక్కిన పెద్దగా ఫలితం కనిపించలేదు. నాగ్ ను ఆ శ్రీరాముడు, గోవిందుడు, సాయిబాబు కూడా ఆదుకోలేకపోయారని ఆయన అభిమానులు అంటున్నారు. ఎన్ని భక్తి సినిమాల్లో నటించినప్పటికి . కేసిఆర్ సర్కార్ నుండి ఏ ఒక్క దేవుడు కాపాడలేదని భావించిన నాగ్, టాలీవుడ్ పెద్దల సలహాల మేరకు .. ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను స్వయంగా కూల్చివేయటంతో.. అందరు ఆశ్చర్యపోయారు.
దీంతో. వైఎస్ జగన్ కూడా నాగార్జునను రక్షించలేకపోయాడని టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. జగన్ కు ..టీఆర్ఎస్ నేతలకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒక్క నాగ్ ను ఇప్పుడు కాపాడితే.. రేపు చాలా మంది నాగార్జునాలు మా వద్దకు వస్తారని ..గులాబీ బాస్ గట్టిగా చెప్పటంతో.. జగన్ , నాగ్ ఏం చేయలేకపోయడాని ఆ పార్టీలోని సినియర్ నాయకులు, నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి వివరించినట్లు టాలీవుడ్ వాసులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more