తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా తెర వెనక తెలుగు దేశంపార్టీకి, పార్టీ బలోపేతానికి తండ్రికి అండగా ఉంటూ వస్తున్నాడు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తాడని అనుకున్నా రాష్ట్ర విభజన తో ఆయన సైలెంట్ అయిపోయాడు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చి తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత లోకేష్ కి పార్టీ కార్యకలాపాలు చూసుకోమని చెప్పడమే కాకుండా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సర్వాధికారాలు చూసుకోమ్మని నాయుడు తన కొడుకు లోకేష్ కే అప్పజెప్పాడు. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్న లోకేష్ బాబు పార్టీలోని యువనేతల, సీనియర్ నేతల మాట సార్థ్యాలను, ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు వారి పై ఎలా రియాక్ట్ అవ్వాలి, వారు వేసిన కౌంటర్ లకు పంచ్ ఎలా ఇవ్వాలో, మీడియా ముందు పార్టీ గురించి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో పార్టీ నేతలకు చెప్పే కార్యక్రమాన్ని కూడా అప్పగించాడట బాబుగారు.
మామూలుగానే వైయస్సార్ నేత జగన్ పై ట్విట్టర్ లో సెటైర్లు, మీడియా ముందు పంచ్ లు వేసే లోకేష్ ఇప్పుడు ఆ బాద్యతల్ని తీసుకొని అందులో శిక్షణ ఇచ్చి, తద్వారా వారి మైండ్ సెట్ మార్చవచ్చని లోకేశ్ భావిస్తున్నారు. ఈ శిక్షణలో సీనియర్లతోనూ గెస్ట్ లెక్చర్లు ఇప్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో చాలా జూనియర్ నేత అయిన లోకేష్ సీనియర్లకు క్లాసులు తీసుకోవడం పై తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారట. అయితే బాబు గారికి భయపడి అంత తమ మంచికే చెబుతున్నారని మరో మాట మాట్లాడకుండా లోకేష్ క్లాస్ లు విని వెళ్ళిపోతున్నారని అంటున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more