తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనకు ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచిన ఇద్దరు గౌడ్ లలో ఒక గౌడ్ పై గుస్సాయించడమే కాకుండా ఆయన్ను దూరం దూరం పెడుతున్నాడనే వార్తలు తెలంగాణ అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉంటూ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రవేశించి, ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేరి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు.
సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లో జరిగిన సభలో శ్రీనివాస్ గౌడ్ ని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించాడు. కానీ ఇటీవల మంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించలేదు. దీంతో కాస్త అసహనానికి గురయ్యిన శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాల రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఉండడం అక్కడ కూడా చక్రం తిప్పాలని చూశాడు. అయితే శ్రీనివాస్ గౌడ్ ఇలా చేయడానికి ఓ కారణం ఉందని అంటున్నారు.
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు స్వామి గౌడ్ కు ఎమ్మెల్మీ పదవి ఇచ్చి, ఆయన్ను శాసన మండలికి ఛైర్మెన్ గా చేయడం, తనకు మంత్రి పదవి ఇవ్వకుండా జాప్యం చేయడంతో చూస్తుంటే త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో కూడా ఆయనకు పదవి దక్కకపోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకుంటే మహబూబ్ నగర్ నుండి సీనియర్ నాయకులు జూపల్లి, లక్ష్మారెడ్డిలు ఉన్నారు. ఒకే జిల్లా నుండి మూడు మంత్రి పదవులు ఇస్తే మిగతా వారి నుండి సంతృప్తి జ్వాలలు వచ్చే అవకాశం ఉండటంతో కేసీఆర్ ఈ గౌడ్ ను ప్రక్కన పెట్టినట్లు చెబుతున్నారు. రానున్న కాలంలో కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్ కి మధ్య దూరం పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more