‘‘వారు కండోమ్ వాడితే.. కేంద్ర మంత్రిగారికి ఒళ్లు మండి.. అగ్గీమీద గుగ్గిలం అవుతున్నారు’’ ఆయన ఆవేశంలో.. కండోమ్ లను పూర్తిగా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంచెం నవ్వుగా ఉన్న ఇది నిజం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అమెరికాలో కండోమ్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఒకరకంగా చెప్పలంటే..కండోమ్ కనిపిస్తే.. చాలు చించిపారేయాలనే కసితో ఆయన ఉన్నారు.
‘‘కండోమ్ వాడండి.. రతీ సుఖం పొందండి ప్రభుత్వమే ఒకపక్క చెబుతుంది’’ ఈ మంత్రిగారేమో కండోమ్ వాడితే కాల్చి పారేస్తాననే విధంగా ఉన్నారు. ‘‘మీ రహస్య శృంగారానికి ..రక్షన మార్గం ఒక్కటే కండోమ్ ’’ బడా బడా కంపెనీల సైతం యాడ్స్ ఇస్తూ.. మగవారికి, ఆడవారికి పూర్తి రక్షణ బాద్యతలు తీసుకుంటే.. మంత్రిగారు మాత్రం తొక తెగిన కోతిలా.. కండోమ్ పై రచ్చ రచ్చ చేస్తున్నారు.
అసలు మంత్రిగారు కండోమ్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ఎయిడ్స్ పై ప్రచారంలో కండోమ్ వాడండి అంటూ పేర్కొంటున్నారని, తద్వారా అక్రమసంబంధాలను ప్రోత్సహించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కండోమ్ వాడకం లేకుంటేనే ఎయిడ్స్ భయంతో ప్రజలు కట్టుతప్పకుండా ఉంటారన్నది మంత్రి వ్యాఖ్యల సారాంశం.
'కండోమ్ వాడండి, ఎయిడ్స్ ను పారద్రోలండి' అన్న నినాదంలో తప్పుడు సందేశం దాగి ఉందని అన్నారు. కండోమ్స్ వాడుతున్నంత కాలం ఎన్ని అక్రమ సంబంధాలైనా నెరపవచ్చని దానర్థం అని మంత్రి వివరించారు. కండోమ్ ప్రచారానికి బదులుగా భార్యాభర్తల అనుబంధంపై ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాంపత్య జీవితమనేది భారత సంస్కృతిలో భాగమని తెలిపారు
అయితే మంత్రిగారు కండోమ్ పై చేసిన వ్యాఖ్యలకు.. కొంతమంది కండోమ్ ప్రియులు, కామరాజులు, కొత్త రాజకీయ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆశుతోస్ మంత్రిగారి కండోమ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఇంకా ఎదగాలని హితవు పలికారు. ఆధునికంగా ఆలోచించడం నేర్చుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.
అయితే కేంద్ర మంత్రి హర్షవర్థన్ తీరు పై కొత్త అనుమానాలు వస్తున్నాయని రాత్రివేళ కండోమ్ తో రతీక్రీడ ఆడే మగరాజులు అంటున్నారు. మంత్రిగారి కండోమ్ వ్యాఖ్యలపై.. కొంతమంది వేశ్యలు, హిజ్రాలు తీవ్రంగా మండిపడుతున్నారు. కొంతమంది అయితే.. వాడేసిన కండోమ్ లను తీసుకొని మంత్రిగారి ఇంటి ముందు కుప్పలు కుప్పులుగా వేసి ధర్నా చేయటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అంటే రెండోమూడు రోజుల్లో మంత్రిగారి ఇంటి ముందు భారీ ఎత్తున్న దర్నా చేయటానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more