తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లో..దళిత ప్రేమ పొంగిపోతుంది. వారి నోటి పదవి అనుభవిస్తున్న కేసిఆర్ .తెలంగాణలోని దళితులపై వరాల ప్రేమ కురిపిస్తున్నారు. కానీ కేసిఆర్ మాటలను దళితులు నమ్మటంలేదు. దాని కారణం ఈ చిన్నఉదాహరణనే , ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసిఆర్ నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల మద్య చెప్పటం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది. అందుకే ఒక దళిత బిడ్డ..కేసిఆర్ పై పగ బట్టి, కోర్టులో పిటిషన్ వేయటం జరిగింది.
ఈరోజు సిఎం కేసీఆర్పై నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పి మోసం చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటీషనర్ సతీష్ మాదిగ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసీఆర్పై కేసు నమోదు చేయ
డానికి పోలీసు అధికారులు కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం చేయడం వల్లే కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. ఫిర్యాదుపై స్పందించిన మూడో అదను చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కేసును జులై 2వ తేదీకి వాయిదా వేశారు.
అయితే ఇలాంటి పట్టించుకోని సీఎం కేసిఆర్ మాత్రం తెలంగాణలోని దళితులకు ఇవి చేయాలని గట్టిగా చెబుతున్నారు. దళితుల అభివృద్ధిని ఒక సవాలుగా స్వీకరించి పని చేస్తానని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు. 10 జిల్లాల కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం కెసిఆర్ మాట్లాడుతూ దళిత వాడల నుంచి పేదరికాన్ని పారద్రోలేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ యుద్ధానికి జిల్లాల కలెక్టర్లే సారధులుగా వ్యవహరించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ దళితుల అభివృద్ధి పేరుతో ప్రచారం జరిగిందే తప్ప మార్పు శూన్యమని కెసిఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో దళితులను ఎపిఎల్ పరిధిలోకి తీసుకు రావాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో దళితుల అభివృద్ధికి 15.4 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఎస్సీల అభివృద్ధికి జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కెసిఆర్ కోరారు. ప్రతి జిల్లాకు దళితుల అభివృద్ధి కోసం సగటున రూ.600 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.
వచ్చే ఐదేళ్లలో దళితుల అభ్యున్నతికి రూ.4000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ప్రతి దళిత వాడలో విద్యావంతులతో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని సిఎం, కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి కేటాయిస్తామని చెప్పారు. మహిళల పేరు మీదే భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు.
దళితులకు ఇప్పటికే 1, 2 ఎకరాల భూమి ఉంటే, మిగతా భూమి సమకూరుస్తామని తెలిపారు. దళితులకు భూమి కేటాయింపులపై అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పని చేయాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్ శాఖను ఎస్సీ డెవలప్మెంట్ శాఖగా మారుస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు.
ఎప్పటికప్పుడు దళితుల స్థితిగతులు తెలుసుకునేందుకు జిల్లాల కలెక్టర్లు ఆయా దళిత వాడల్లో పర్యటించాలన్నారు. దళితుల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలంలోనూ ఒక అధికారిని నియమించనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. కేసిఆర్ ఈరకంగా దళితులపై ప్రేమ కురిపిస్తున్న.. తెలంగాణ దళితులు మాత్రం నమ్మటంలేదు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మాట తప్పిన మనిషిగా దళితులు గుర్తించారు. అందుకే ఆయన ఎన్ని వరాలు, ఎంత ప్రేమ కురిపించి నమ్మెస్థితిలో దళితుల లేరని అర్థమవుతుంది. ‘‘అద్దం పగిలిపోతే..గతంలో పారేస్తారు.. కానీ ఇప్పుడు అతికిస్తున్నారు’’, కానీ ‘‘ఒక్కసారి నాయకుడి మీద నమ్మకం పోతే....తిరిగి రావటం చాలా కష్టమని ..దళిత సంఘాలు’’ అంటున్నాయి.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more