ఎన్నికల సమయంలో ఆరంగుళాల నాలుకతో . బెల్లి డ్యాన్స్ చేసిన తెలంగాణ రాజకీయ నేతలు. అధికారం కోసం అర్థరాత్రి హామీలు రాసుకోని పట్టపగలు ..ప్రజల మద్య గొప్పగా హామీలు ఇవ్వటం జరిగింది. అధికారం రాబోతుందనే ఆనందం ఒక పక్క, కొత్త రాష్ట్రం ఏర్పడుతుందనే .. ఉత్సహం మరో వైపు.. మన గులాబీ నేతల చేత. హామీల వర్షం కురిపించాయి.
గులాబీ నేతలు కురిపించిన హామీల వర్షంలో బాగా తడిసిపోయి, మా జీవితాలు, మా పొలాలు బాగుపడతాయని.. ‘కారు’ మబ్బులు తొలిగి.. వెలుగు జీవితాలు వస్తాయని.. ఆనందంగా ..గులాబీ నేతలను గెలిపించారు. కానీ అధికార పదవి చేతిలోకి రాగానే.. ఇచ్చిన హామీలపై .. కసరత్తు మొదలుపెట్టి.., రోజకోక రకంగా.. ఘోరమైన ప్రకటనలు చేస్తున్నారు. రుణామాఫీలు చేస్తాం ..కానీ అందరికి కాదు.. గోల్డ్ లోన్ అంతకంటే కాదని గులాబీ పార్టీ మంత్రులు బల్ల గుద్ది చెబుతున్నారు.
తెలంగాణ రైతుల రుణామాపీ మొత్తం .. 57 వేల కోట్లులని లెక్కలు తెల్చిరు బ్యాంకు అధికారులు. గులాబీ మంత్రులు సమావేశం అయ్యి .. రుణామాపీలపై.. కొత్త కొత్త నేరాలు స్రుష్టించారు. కేవలం 12 వేల కోట్ల రుణామాపీ మాత్రమే చేస్తాం. అదీ కూడా .. 2013, 2014 మద్యలో తీసుకున్న రుణాలే అని ఘోరమైన ప్రకటనలు చేయటంతో.. తెలంగాణ రైతుల ఆశలపై మాపీ దెబ్బలు ఘోరంగా పడినట్లు తెలుస్తోంది. ‘‘ ఏరు దాటక ముందు మల్లన్న.. ఏరు దాటినాక.. బొడి మల్లన్న’’ అనే విధంగా గులాబీ మంత్రులు ప్రవర్తిస్తున్నారని.. తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అందరికి న్యాయం చేస్తాం. కానీ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. ‘‘ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి గానీ.’’ నా పెళ్లికి తిందువులే అని చెబితే.. ఆకలైనోడికి ..ఎక్కడో కాలుతుంది.అదేవిధంగా..హామీలు ఇచ్చారు కాబట్టి, అమలుపరచండని..తెలంగాణ రైతులు అడుగుతున్నారు.
హామీలుఇచ్చింది మీరే.. ఆగమనేది మీరే...? అలాంటప్పుడు.. హామీలుఇవ్వటంఎందుకు.... తీర్చలేక .సతమతమవ్వటం ఎందుకని టి-రైతులు అడుగుతున్నారు. కానీ గులాబీ బాస్ మాత్రం .. మరి కొన్ని రోజలు వాయిదా వేసి, పరిస్థితి పై క్షుణ్ణంగా పరిశీలించి, తెలంగాణ రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనలతో ఉన్నట్లు .. ఆ పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు.
అలాగే లక్షకుపైగా రుణం తీసుకున్న రైతుల విషయంలో లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందని, మిగతా మొత్తాన్ని వారే చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన వివరించారు. ఇక వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంట రుణాలు, పరోక్ష రుణాలకు ఈ మాఫీ వర్తించదని కూడా బ్యాంకర్లకు కేసీఆర్ తేల్చి చెప్పారు.
మూడు నాలుగేళ్లుగా బకాయిలు చెల్లించని వారికి రుణ మాఫీ వర్తించదని స్పష్టం చేశారు. రుణ మాఫీతో సంబంధం లేకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నెల 9న బ్యాంకర్లతో మళ్లీ సమావేశంకావాలని నిర్ణయించారు. చివరకు గులాబీ నేతలు ఎలా మాపీ చేస్తారో.. చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more