‘‘ నేను అబద్దం ఆడి ఉంటే.. ఏం జరిగేదో.. తెలుగు ప్రజలు, నా అభిమానులకు’’ బాగా తెలుసు? ‘‘ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగిరినట్టు’’అందుకే నేను అబద్దం ఆడలేదు.., కేవలం మీకోసమే... మీ కోసమే... నేను అబద్దం ఆడలేదు.. అని రాజకీయ యువనేత అంటున్నారు. సీఎం పదవి కోసం .. ఐదు సంవత్సరాలు ఒంటి కాలి మీద తపస్సు చేసి ఓడిపోయాడు. అధికారం కోసం అప్యాయంగా ఓదార్పు యాత్ర చేయటం ఆయనకు అలవాటు మారింది. అంతేకాదు అంధికారం కోసం జైలు కు వెళ్లి బెయిల్ పై వచ్చి ప్రజల మద్య తిరుగుతున్నాడు.
ఈ యువ నేతలో ‘‘సత్య హరిశ్చంద్రుడు’’ కనిపిస్తున్నాడని..అతనిపై అభిమానం ఉన్న అంధకార నేతలు, అమాయక ప్రజలు గొప్పగా చెప్పకుంటున్నారు. నిజంగా ‘‘సత్యం హరిశ్చంద్రుడు’’బతికి ఉంటే. మాత్రం సిగ్గుతో.. కాలుతున్న చితిలోకి దూకి చచ్చిపోయేవాడని చరిత్ర తెలిసిన.. సినీయర్ నాయకులు అంటున్నారు.
అబద్దం ఆడితే.. ‘‘గోడ కట్టినట్లు ఉండాలి ..కానీ మన యంగ్ రాజకీయ నేత మాత్రం తడిక కట్టినట్లు’’ కూడా లేదని ఆయనకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లు అంటున్నారు. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆశపడిన అధికారం దక్కకపోగా .. ప్రతిపక్షంలో కూర్చోనే ఛాన్స్ రావటంతో యంగ్ నేత తెగ బాధపడి, రాత్రి, పగలు బాగా ఆలోచించి ..తన పార్టీ ఓటమిగల కారణం తెలుసుకోని.. గోదావరి ప్రజల మద్యకు బయలుదేరాడు.
సీమాంద్రలో పార్టీ ఓడిపోవటానికి కారణం .. కేవలం 5లక్షల మంది ప్రజలే అని మీడియా ద్వారా బయట పెట్టాడు. అంతేకాదండోయ్.. చిత్తూరు.. చంద్రం సార్ మాదిరి..నేను అబద్దపు హామీలు ఇవ్వలేదు.. అందుకే ఓడిపోయాం తెల్చాడు. చిత్తూరు సార్ మాటలు 5లక్షల మంది నమ్మబట్టే.. మాకు .. ప్రతిపక్ష స్థానంలో కూర్చునే ఛాన్స్ దక్కిందని తన మనసులో బాధను బయటకు కక్కేసుకున్నాడు.
ఆ 5లక్షల మంది కూడా .. ఫ్యాన్ స్విచ్చ్ నొక్కి ఉంటే.. నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోని.. 30 సంవత్సరాల పాటు .. తెలుగు ప్రజలకు సేవాలందించే వాడినని.. మనసులోని ఆనందాన్ని మీడియా ముందు చూపించారు. ‘‘ మీ అయ్య.. ఐదు సంవత్సరాలు ఏలినందుకే.. ఆంద్రప్రదేశ్ పటం చిరిగిపోయింది. అన్నం పెట్టే.. అన్నపూర్ణలాంటి ఆంద్రప్రదేశ్.. అడుక్కునే స్థాయికి దిగజారిపోయింది. అయ్యకు సహకరించిన.. అధికారుల జీవితాల్లో అంధకారం అవరించిన. విషయం ప్రతి తెలుగు వారికి తెలుసు. మరోసారి ఎలా మోసం పోమ్మంటావు చెప్పుయ్యా.... అని భూములు కోల్పోయిన రైతులు, జైలుకు వెళ్లిన అధికారుల పిల్లలు.. ఆవేశంగా అడుగుతున్నారు. ఇక అబ్బాయికి పట్టం కడితే.. మా పరిస్థితి ఏమిటయ్యా.. అని సీమాంద్ర లోని ఐదులక్షల ప్రజలు ధీనంగా అడుగుతున్నారు.
‘‘దుమ్ము దులపండని.. పదే పదే.. నీవు చెప్పిందే చేశాం అని ఐదులక్షల ప్రజలు ’’అంటున్నారు. చిత్తూరు సార్ .. గెలవటానికి .. కోటి 35 లక్షలు ఓట్లు వచ్చాయి, నేను ఓడిపోవటానికి కోటి 30 లక్షల ఓట్లు వచ్చాయి, ఇద్దరి మద్య 5 లక్షలే పెద్దగా తేడా లేదు, ఆయన రైతు రుణాలమాపీ చేస్తాడని చెప్పారు. నేను చెప్పలేదు ..మిగిలినవన్నీ .. సేమ్ టూ..సేమ్.. అని గొప్పగా వర్ణించుకున్నారు.
అయినా ‘‘కర్ణుడి చావుకి వంద కారణాలు ఉండొచ్చు’’ అలాగే మన పార్టీ ఓడిపోవటానికి లక్ష కారణాలు ఉన్నాయని ఆ పార్టీలోని సీనియర్ నేతలు యువనేతతో చెప్పినప్పటికి , నేను ఎవరి మాట వినను.. నేను సీతయ్యకు తమ్ముడిలాంటోన్ని.. అని వారిపై సమ్మర్ నిప్పులు కురిపించినట్లు ఆ పార్టీలోకి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే .. ‘‘కోమ్మల్లో కమ్మగా పాటే కోయిలా..రంగు, నా రంగు ఒకటే కదా.. అని ..కాకి పాట పాడితే ’’ ఎలా ఉంటుందో.. మన నేత తీరు కూడా అలాగే ఉందని పార్టీలోని సీనియర్ నేతలు అనుకుంటూ.. బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో చిత్తూరు సార్.. రైతు రుణాలమాఫీ చేస్తాడని అబద్దపు హామీ ఇచ్చాడు.. 87 వేల కోట్ల రుణాలమాపీ ఎలా చేస్తాడని ..నేను అడుగుతున్నా? అని రాజమాండ్రి గోదావరి ఓట్టున కడిగేసాడు. త్వరలో ఖరీఫ్ సీజన్ రాబోతుంది.. కాబట్టి ఆ చిత్తూరు సార్ ను రైతులు దుమ్ము దులిపేస్తారని యువనేత ఆవేశంగా తన పార్టీ కార్యకర్తలతో చెప్పటం జరిగింది.
అయితే ఈ సమవేశలో.. కొన్ని గొంతులు విచిత్రంగా వినిపించాయి.. ‘‘దుమ్ము దులపండి.. దుమ్ము దులపండని పదే పదే మనం చెప్పటంతో.. ప్రజలు మన దుమ్ము దులిపారని వారు వాపోతున్నారు.’’ నేను అడుగుతున్నా.. నేను అడుగుతున్నా.. అనే మాటలే చివరకు మనమే అడిగే స్థానంలో కూర్చోపెట్టారని కార్యకర్తలు కన్నీరు పెట్టుకోని బాధపడుతున్నారు. ఇకనైన మీరు మారండి.. ? లేదా మేమే ఏదో పార్టీలోకి మారుతాం అని గెలిచిన నాయకులు.. గోల చేస్తున్నారని .. పార్టీలోకి సీనియర్ నాయకులు అంటున్నారు.
గోదావరి ఒట్టున జరిగిన సమావేశంలో.. సమస్యలు ఘోరంగా యువనేత పైకి రావటంతో.. సమవేశాన్ని.. వచ్చే నెలకు వాయిదా వేసి..యువనేత అక్కడి నుండి వెళ్లిపోవటం జరిగింది. కానీ నేతలు మాత్రం గోడ దూకే ప్రయాత్నలు.. ప్రాక్టీస్ చేస్తూ .. ఛాన్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చిత్తూరు సార్ .. ప్రమాణా స్వీకారం జరిగిన తరువాత మనకు మంచే జరుగుతుందని ఆపార్టీలోని గోడ దూకే నాయకులు ఆనందంగా ఉన్నట్లు పార్టీలోని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more