‘‘నువ్వు రాజీనామా చేస్తావా? లేక రాత్రికి నిద్రలేకుండా చేయమంటావా? అనే మాటలతో.. ఆయనకు నిజంగా నిద్రలేకుండా పోతుంది. నిన్నటి వరకు ఆయన చుట్టు బౌన్సర్ల సెక్యూరిటితో.. రాజకీయ నేతలతో సమావేశం అయిన ఐదగుడుల బుల్లెటు.. ఇప్పడు ఒంటరిగా నాలుగు దిక్కులు చూస్తూ సమయం గడుపుతున్నారు. ‘‘నేనేమి చేసాను నేరం, నన్నునేక్కడంటింది పాపం ’’ అంటూ పాటలు పాడుకుంటూ.. తన ఓటమిని, పార్టీ పరాజయాన్ని తలుచుకోని కుమిలిపోతున్నారు తెలంగాణ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య.
నిన్నటి వరకు గాంధీ భవన్ లో చక్రం తిప్పిన ఆయన.. నేడు ఆ భవనం వైపు కూడా చూడటలేదని ..కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఇక పార్టీలోని తెలంగాణ సీనియర్ నేతలు మాత్రం ‘‘నీ వల్లే .. నీ వల్లే ..మేం ఓడిపోయాం, మన పార్టీ పరువు పోయిందని’’ తెగ గుస్సా చేస్తున్నారు. ఆ పార్టీలోని కార్యకర్తలు అయితే.. ‘‘నువ్వు రాజీనామా చేస్తావా? లేక రాత్రికి నిద్రలేకుండా చేయమంటావా’’ అంటూ వార్నింగ్ ఇవ్వటంతో. పొన్నాల పరిస్థితి ఘోరంగా తయారైందని పార్టీలోని ఆయన అభిమానులు అంటున్నారు.
ఎన్నికల సమయంలో.. గులాబీ బాస్ పై.. ఎగిసిపడిన పొన్నాల.. ఎన్నికల తరువాత చాలా సైలెంటుగా ఓటమి బాధను అనుభవిస్తూ, వస్తున్న ఏడుపును ఆపుకోలేక అల్లాడిపోతున్నట్లు పార్టీలోని ఆయన అభిమానులు అంటున్నారు. ఇప్పుడు పొన్నాల పరిస్థితి ‘‘ఇంట్లో ఇనుప కత్తి .. బయట బంగారు కత్తి ’’ లాగా ఉందని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అంటున్నారు.
అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ హైకమాండ్ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో పొన్నాల కాస్త ఊపీరి పీల్చుకుంటున్నారు. నిన్నటి వరకు అధికారంలో ఉన్న వారు ఇక నుండి గులాబీ బాస్ ఎదుట .. ప్రతిపక్షం పాత్ర పోషించాల్సిందేనా అని కాంగ్రెస్ పార్టీలోని సినియర్ నాయకులు అవమానంతో నలిగిపోతున్నట్లు సమాచారం.
తెలంగాణ ఆవిర్బాదిన్సోతానికి కొద్ది రోజులే ఉండటంతో పొన్నాల ఆందోళన చెందుతున్నారు. ఆరోజు గులాబీ దళం , మిగిలిన పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. మరీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, దీనికి హైకమాండ్ ఒప్పుకుంటుందా లేదా అని కాంగ్రెస్ పార్టీలోని వయసు ముదిరిన నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.
అసలే ‘‘తింటానికి తికనం లేదని బాధపడుతుంటే.. తెల్ల చొక్క కావాలని గోల చేశాడట’’ అనేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు , కార్యకర్తల పరిస్థితి అలా తయారైనట్లు తెలుస్తోంది. అధికారం పోయి అల్లో రామచంద్రా అని బాధపడుతున్న హైకమాండ్ కు , తెలంగాణ పీసీసీ పొన్నాలకు తెలంగాణ ఆవిర్బాదినోత్సం పెద్ద తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ పార్టీ నేతలే .. గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. జూన్ 1 అర్థరాత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతలు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
అందుకే ముందుగా తెలంగాణ ఐదడుగుల బుల్లెటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కలిసి తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో పార్టీ ఓటమికి గల కారణాలను వారికి వివరించారు. అదే విధంగా రాష్ర్టంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితిని కూడా వివరించినట్లు సమాచారం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more