నాలుగు సంవత్సరాల నుండి.. ముఖ్యమంత్రి పదవి కోసం కష్టపడుతున్న యంగ్ రాజకీయ నేత ..వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తండ్రి మరణంతోనే ..ఆయన లో బలమైన కోరిక పుట్టింది. తన కలను నిజం చేసుకోవటానికి జగన్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ‘‘మూడు ముద్దులు, ఆరు ఓదార్పు యాత్రలు ’’ అంటూ తెలుగు ప్రజల మద్య తెగ తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పై కత్తి దూసిన ..యంగ్ తెలుగు సింహం అని.. ఆ పార్టీ నాయకులు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ‘‘రాజన్న రాజ్యం రావాలంటే.. జగనన్న రావాలి’’ అంటూ , ఆంద్రప్రదేశ్ ను స్వర్ణంద్రప్రదేశ్ గా చేస్తానని ‘‘కరెంట్ లేని ఫ్యాన్ తో ప్రజలకు గాలి విసరటం జగన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన జరిగిన వెంటనే.. నేను, నా ఫ్యాన్ సీమాంద్రకే జై అంటూ.. తెలంగాణ లో తిరుగుతున్న ఫ్యాన్ కు జగన్ కరెంట్ కట్ చేయటం జరిగింది. అయితే సీమాంద్ర లో జగన్ ఫ్యాన్ కు చాలా మంది రాజకీయ నాయకులు ఆకర్షితులై, 2014 ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణలో అతి కొద్ది మంది మాత్రమే.. ఫ్యాన్ ను నమ్ముకున్నారు. వైఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రకటనలు జోరుగా మీడియాలో హల్ చల్ చేశాయి..‘‘ఆయన వస్తున్నాడు’’..ఫ్యాను గుర్తుకు ఓటేయ్యండి? దుమ్ముదులపండి?, మామయ్య వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు, రాజన్న రాజ్యం వస్తుంది. పెద్దాయన వస్తున్నాడు.. అంటూ మీడియా ఎన్నికల ప్రచారం ప్రకటనలకు రక్తి కట్టించారు. చిన్న పిల్లవాడి దగ్గర నుండి, పండు ముసలోడు వరకు ఈ రాజకీయ ప్రకటనల్లో నటించారు.
సీమాంద్రలో ..జగన్ ఫ్యాన్ తిరుగులేకుండా తిరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరిగింది. ‘‘ఏ నిమిషనికి ఏమి జరుగునో’’ ఎవరు చెప్పలేరు. జగన్ అండ్ కో .నేతలు ఆయన వస్తున్నాడు.. మనం గెలుస్తాం అని ఫ్యాన్ గాలి కింద తడిబట్ట వేసుకునే సమయంలో.. తెలుగు ప్రజల కోసం పుట్టిన ‘‘జనసేన పార్టీ’’ తెరపైకి వచ్చింది. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి వాటి గురించి పెద్దగా పట్టంచుకోవాల్సిన పనిలేదని వైసీపీ నేతలకు.. ఆ పార్టీ అధినేత భరోసా ఇవ్వటం జరిగింది. కొంతమంది సీనియర్ నేతలు మాత్రం జగన్ చాలా జాగ్రత్త అని హెచ్చరించారు. కానీ ఆయన వారి మాటలను పట్టించుకోలేదు కదా.. వారిని చిన్న చూపు చూసినట్లు ఆపార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.
దుమ్ము దులపండి., దుమ్ము దులపండని.. పదే పదే అంటున్న వైసీపీ నాయకుల దుమ్మును సీమాంద్రలో నిజంగానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దులిపేశాడు. అప్పటి వరకు.. సీమాంద్రలో ఫ్యాన్ ఎలాంటి ఆటంకం లేదని చంకలు గుద్దుకున్న వైసీపీ నేతల పాదాలకు వణుకు మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని రేసులో ఉన్న బీజేపి సీనియర్ నేత నరేంద్ర మోడీ , జనం కోసం ఉదయించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి.. సీమాంద్రలో ఫ్యాన్ కు ఉన్న మూడు రెక్కలపై రాజకీయ దాడి చేయడం జరిగింది. అప్పటి వరకు.. జగన్ ఓదార్పు, రాజన్న మాయలో ఉన్న సీమాంద్ర ప్రజలు ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నారు.
రాష్ట్రం విడిపోతున్న సమయంలో సైలెంట్ గా ఉన్న జగన్ ను సీమాంద్రకు ముఖ్మమంత్రి ని ఎలా చేస్తారు? అనే ప్రశ్న ఐదు కోట్ల మంది ప్రజల మనసును తాకింది. అవినీతి అడ్డంగా దొరికిపోయి, 16నెలలు జైల్లో శిక్ష అనుభవించిన వ్యక్తి సీమాంద్ర ప్రజలు ఎలా సీఎంగా ఎన్నుకుంటారు? దీంతో సీమాంద్ర ప్రజలు జగన్ మైకం వదిలి కళ్లు తెరిచి, రాజధాని లేని సీమాంద్ర ప్రాంతాన్ని ఎలా అభివ్రుద్ది చేసుకోవాలి? సీమాంద్ర ప్రజలకు ఎవరు నాయ్యం చేయగలరు, ఏ రాజకీయ పార్టీ సీమాంద్ర ప్రజలను ఆదుకుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం జరిగిందని రాజకీయ మేథావులు అంటున్నారు.
అందుకు ఉదాహరణ.. వెలువడిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలే నిదర్శనం అంటున్నారు. ఈ ఫలితాలు చూసిన వైసీపీ నేతల్లో ‘‘ఆయన (జగన్) వస్తున్నాడు(డా)? లేదో అనే అనుమానంతో నలిగిపోతున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరి కొన్ని గంటల్లో రాజకీయ నేతల తలరాతులు బయటపడతాయి కాబట్టి, ఇప్పటికే కొంతమంది హై బిపీతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రతి రాజకీయ నాయకుడు.. బిపీ మాత్రలు జేబులు పెట్టుకొని సిద్దంగా ఉంచుకున్నట్లు ఆ పార్టీలోని చోట నాయకులు అంటున్నారు.
ఆయన (జగన్) వస్తాడని, మాకు రాజకీయ పదవులు వస్తాయని, ఐదేళ్లు పాటు.. హాయిగా అనుభవిస్తూ , ఎంజాయ్ చేద్దామన్న రాజకీయ నేతలకు ఇప్పుడు వెన్నులో వణుకు మొదలైంది. తెల్లవారితో.. తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటో బయటపడుతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేతలు ఇలా భయపడటానికి కారణం ‘‘జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దెబ్బ అని రాజకీయ మేథావులు అంటున్నారు.
వైసీపీ నేతలు.. కొంతమంది ..టీడీపీ నేతలతో.. మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కొన్ని ఛానల్స్ డబ్బులు తీసుకొని, వైసీపీ అనుకూలంగా సర్వేలు చేయించి, జగన్ కు చేవులో పువ్వులో పెడుతున్నారని.. ఆ పార్టీలోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఫెయిడ్ న్యూస్ తో.. జగన్ ఆనంద డోలికలలో తేలిపోతున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు. కానీ వాస్తవం మరోలా ఉందని, సీమాంద్ర ప్రజల తీర్పు సరికొత్తగా ఉంటుందని ఆ పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు.
కొసమెరుపు : ఆయన వస్తున్నాడా? లేదా అనేది.. మరికొన్ని గంటల్లో తెలుస్తోంది.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more