భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తును రద్దు చేసుకుంటోంది!
సీట్ల సర్దుబాటులో సమస్యే కాకుండా, సిద్ధాంత పరంగా కూడా ఉన్న వ్యత్యాసాల వలన కూడా పొత్తు రద్దవుతున్నట్లు వార్త.
కాంగ్రెస్, ఇతర పార్టీల నుండి ఎక్కువ సంఖ్యలో వలసలు రావటంతో అంతకు ముందునుంచే పార్టీ లో పనిచేస్తున్న నాయకులకు తెలుగు దేశం పార్టీ న్యాయం చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా ఎక్కువ మంది నాయకులు చేరటంతోపాటు మోదీ హవా ఆ పార్టీని గెలిపిస్తుందని, ఎవరి పొత్తులూ అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
పొత్తును రద్దు చేసుకోవటానికి కారణాలను చెప్తూ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, సీమాంధ్రలో వైకాపాతో పోటాపోటీగా ఉన్న తరుణంలో గెలిచే అవకాశాలను మెండుగా ఉన్న స్థానాలను భాజపాకి ధరాదత్తం చెయ్యటం వలన పార్టీకి నష్టం కలుగుతుందని భావిస్తున్నట్లుగా తెదేపా నాయకులు చెప్పుకుంటున్నారు.
రెండవ కారణం ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష ప్రమేయం. భాజపాను వెనకనుండి నడిపిస్తూ వస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బాహాటంగా ముందుకొచ్చి నిర్ణయాత్మక విషయాలలో కలుగజేసుకోవటం వలన సెక్యూలర్ విధానానికి అది గొడ్డలిపెట్టు అవుతుందని తెదేపా భావిస్తోంది.
సీనియర్ రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు అనుభవానికి గౌరవమివ్వకుండా భాజపా నేతలు ఆయన సూచనలను కొట్టిపారేసి అవమానపరచారనే అభిప్రాయం కూడా తెదేపా నాయకులలో ఉంది. ఉదాహరణకు విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావుని పోటీకి నిలబెడదామని చూస్తే భాజపా పట్టుబట్టి ఆ సీటుని తీసుకుంది. దానితో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మిని అక్కడ నిలబెట్టారు. ఇలా సీట్ల అడ్జస్ట్ మెంట్ల వలన పూర్తిగా ఆ స్థానాలే అన్యాక్రాంతమయ్యే అవకాశాలుండటంతో తెదేపా నాయకులు చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్నారు.
అయితే ఇదంతా సీమాంధ్రలోనే సుమా. తెలంగాణాలో పొత్తు యధావిధిగా సాగుతుందంటున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా తెదేపాతో పొత్తు తెలంగాణా భాజపాకి ఆ ప్రాంతంలో ఇబ్బంది కలిగిస్తున్నట్లుగా ఆ ప్రాంత నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొదటి నుంచి ఈ పొత్తుకి వ్యతిరేకంగానే ఉన్నారు. అయినా తెదేపా పొత్తుల విషయంలో సీమాంధ్ర ప్రాంతంలోనే రద్దు చేసుకోవటానికి ఆలోచిస్తోంది.
ఈ పొత్తుల రద్దు మరో కార్యక్రమానికి కూడా నష్టం చేకూర్చింది. అది 22 న హైద్రాబాద్ లో నరేంద్ర మోదీ, చంద్రబాబులతో పవన్ కళ్యాణ్ వేదిక పంచుకునే కార్యక్రమం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more