విశాఖపట్నంలో జనసేన సభ ఆరంభమైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేదిక పై నుంచి అభిమానులకు అభివాదం తెలిపారు. దీంతో, సభ ప్రాంగణం అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. జనసేన సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ లోని హైలెట్స్..
విశాఖపట్నంలో జనసేన సభ ఆరంభమైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేదిక పై నుంచి అభిమానులకు అభివాదం తెలిపారు. దీంతో, సభ ప్రాంగణం అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. నాకు విశాఖపట్నం అంటే ఎంతో ఇష్టమంటూ పవన్ ప్రసంగం ఆరంభించారు. వైజాగ్ నటుడిగా తనకు ఓనమాలు నేర్పిందని చెప్పారు.
అప్పట్లో తాను నటనలో పాఠాలు నేర్చుకునే సమయంలో ఎక్కువగా భీమిలి వెళ్ళేవాణ్ణని తెలిపారు. నేడు సభ కోసం విశాఖ వచ్చి హోటల్ నుంచి సముద్రాన్ని చూస్తే పాత జ్ఞాపకాలు మదిలో మెదిలాయని చెప్పారు. ఆ సముద్రం ఒకరికి సలాం చేయదని, అందుకే తనకు సముద్రం అంటే ఇష్టమని తెలిపారు.
పార్టీని మట్టిలో కలపాలి..
కాంగ్రెస్ పార్టీపై పవన్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. పదికోట్ల మంది తెలుగువారు పిడికిలి ఎత్తితే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ సర్వనాశనమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ మట్టిలో కలవడం ఖాయమని అన్నారు. ఆ పార్టీని కూకటివేళ్ళతో సహా పెకలించివేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చా: పవన్
నేను కుళ్ళు రాజకీయాల పట్ల కడుపుమండే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఓట్ల కోసం, పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తాను అందరి నేతల్లా వేషభాషలు పాటించడంలేదని తెలిపారు. అందుకే ఖద్దరు బట్టలు ధరించడంలేదని పేర్కొన్నారు.
ఇజం పుస్తకం అంకితం..
నా వెనుక బలమైన సిద్ధాంతాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అలాంటి సిద్ధాంతాల సమాహారమే తన ఇజం పుస్తకమని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని భారతజాతికి అంకితమిస్తున్నట్టు సభ సాక్షిగా ప్రకటించారు. అవినీతిమయ రాజకీయాలను మార్చాలంటే బలమైన సిద్ధాంతం కావాలని 'ఇజం' తన పార్టీ బలమని వివరించారు.
గాంధీలు కాలేరు
జనసేన సభలో పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్ లపై సెటైర్లు వేశారు. జాతిపిత పేరును ఇంటిపేరుగా పెట్టుకున్నంత మాత్రాన జాతిపితలు కాలేరని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఐక్యతకు ముప్పు తెచ్చింది కాంగ్రెస్ వాదులేనని పవన్ ఈ సందర్భంగా మండిపడ్డారు. భారత జాతి సమగ్రతకు వాళ్ళు తూట్లు పొడిచారని ఆయన దుయ్యబట్టారు.
అది చాలు...
రాజకీయ నాయకుల వేష భాషలు తనకు రావని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్నికల సీజన్ కారణంగా ఖద్దరు బట్టలకు డిమాండ్ పెరిగి చాలా ఖరీదైపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు సాయంత్రం విశాఖలో ప్రారంభమైన జనసేన తొలి బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు.
ప్రసిద్ధ హిందీ నటుడు రాజ్ కపూర్ చెప్పినట్లుగా తనకు హిందుస్థానీ హృదయం ఉందని పవన్ పేర్కొన్నారు. వేసుకున్న ప్యాంట్ అమెరికాదైనా, టోపీ రష్యాదైనా మనసు మాత్రం భారత్ దేనని పవన్ స్పష్టం చేశారు. అధికారం కోసమో, ఓట్ల కోసమో రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక స్పృహతోనే తాను పార్టీని స్థాపించినట్టు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
దురద లేదు..
నేను ప్రత్యేకమైన అజెండాతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రతి రోజూ టీవీల్లో కనిపించాలన్న దురద లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు., రాజకీయ వ్యవస్థలో సమూల మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపాడు. సంపూర్ణ క్రాంతే జనసేన అజెండా అని వివరించారు
తల తీసే చట్టం రావాలి:
ఐదు, పదివేలకు కక్కుర్తిపడే అధికారులను పట్టుకుంటారని, వేలకు వేల కోట్లు దోచుకునే నేతలను ఏమీచేయరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి విషయంలో కాంగ్రెస్ ను ఎదిరిస్తే కేసులు పెడతారని మండిపడ్డారు. అందుకే అవినీతి విషయంలో కఠినమైన చట్టం రావాలని అభిప్రాయపడ్డారు. ఆ చట్టం ఎంత కఠినంగా ఉండాలంటే పవన్ కల్యాణ్ తప్పు చేసినా తల తీసేలా ఉండాలని పేర్కొన్నారు.
పార్టీ విలీనం...
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకపోతే తాము కాంగ్రెస్ లో కలిసి పోతామని కొంత మంది ఎమ్మెల్యేలు అన్నారని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి అందుకే విలీనం చేశాడని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్నయ్య చిరంజీవి, తాను చెరో వైపు ఉండాల్సి వచ్చిందని.... అది భగవంతుడి లీల అని భావిస్తానని పవన్ అన్నారు. అన్నయ్య పై గౌరవం, ప్రేమ ఏ మాత్రం తగ్గలేదన్నారు. అన్నయ్య అనుభవంతో తన అనుభవం తక్కువ అని నమ్ముతానని పవన్ చెప్పారు.
నేను పోటీ చేయను:
సమాజం కోసం స్వార్థం లేకుండా ప్రజా సేవకు అంకితమయ్యే నేతలు దొరికే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలో జనసేన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్వార్థం లేని, విలువలు కలిగిన యువకుల కోసం వెతుకుతున్నానని, అలాంటి వ్యక్తులు దొరికిన రోజు సీమాంధ్రలోనూ, తెలంగాణ లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.
నవ తెలంగాణను నిర్మాస్తానన్నారు. అప్పటి వరకు ప్రజల తరుపన నిరంతరం జనసేన పార్టీ పోరాడుతూ ఉంటుందని స్పష్టం చేశారు. తనకు ఓట్లను చీల్చడం ఇష్టంలేదని చెప్పారు. ఈ ఎన్నికలలో ప్రజలు తమకు నచ్చిన నాయకులకు ఓటు వేయాలని, నూతన రాజధానిని నిర్మించే సత్తా ఉన్న నాయకునికి ఓటేయానిని సూచించారు.
అప్పుడు నేను మాట్లాడలేదు..
రాష్ట్ర విభజన అంశంపై పార్టీలు మంచి చేస్తాయన్న ఉద్దేశంతోనే తాను విభజనపై అప్పట్లో నోరెత్తలేదని తెలిపారు. కానీ కొందరు నేతలు అధికారం కోసం, కాంట్రాక్టుల కోసం విభజన నిర్ణయం తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారికి ఇంగితజ్ఞానంలేదని విమర్శించారు.
రాష్ట్రం విడిపోతుందని ఎవరైనా ఊహించారా?
విభజన తీరుపై గళమెత్తిన ఆయన పద్నాలుగేళ్ళ క్రితం రాష్ట్రం విడిపోతుందని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. మళ్ళీ వేర్పాటు వాద ఉద్యమాలు వస్తాయనే జనసేన పార్టీని ఏర్పాటు చేశానని స్పష్టం చేశారు.
ప్రజానేతలకే మీ ఓటు..
కొత్త రాష్ట్రం, రాజధానిని నిర్మించే సత్తా ఉన్న నేతకే ఓటేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు సూచించారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే పార్టీలు పిచ్చిపిచ్చివేషాలు వేసినా, నీతినియమాలు తప్పినా జనసేన పార్టీ ఉద్యమస్వరూపం చూస్తారని ఆయన హెచ్చరించారు.
ప్రధానిగా చూడాలి..
బీజేపీ నేత నరేంద్రమోడీని దేశ ప్రధానిగా చూడాలన్నది తమ ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. మోడీకి తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. మోడీ ప్రధాని అయితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కలుగుతోందని పవన్ చెప్పారు. జైహింద్.. జైహింద్..
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more