రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచే గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నారు. చంద్రబాబు స్పీడ్ గా, చుర్గుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా సమయంలో.. పార్టీలోని అసంత్రుప్తి నేతలు గోడలు దూకుతున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు పసుపు పచ్చ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
టిడిపి రాజ్యసభ సభ్యత్వాన్ని నిరాకరించిననాటి నుంచి పార్టీలో సంతోషంగా లేని నరసింహులు తన తదుపరి రాజకీయ అడుగు గురించి మద్దతుదారులు, శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటున్నట్లు సమాచారం.
అంతా అనుకూలిస్తే పాలక పక్షం సభ్యునిగా ఆయన కొత్త అవతారం ఎత్తవచ్చు. అయితే తాను టిడిపిని వీడుతున్నట్లు నరసింహులు ఇప్పటిదాకా ఎక్కడా బహిరంగంగా చెప్పనప్పటికీ కె.జానారెడ్డి లాంటి కొందరు తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులు టిడిపి సీనియర్ నాయకుడు పాలక పక్షంలో చేరేలా ఏఐసీసీ నాయకత్వానికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి నరసింహులు చేరికతో తెలంగాణలో ఎస్సీల హృదయాలను పార్టీ కొంత మేరకు గెలుచుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దాంతో ఆయన చేరిక అంశాన్ని ఏఐసీసీ నాయకత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది. వాస్తవానికి, టిడిపి తరఫున రాజ్యసభ సీటును పొందడంలో విఫలమైన మోత్కుపల్లి వెనువెంటనే.. తాను టిడిపిలో కొనసాగడానికి ఎలాంటి కారణం కనిపించడంలేదని ప్రకటించే దాకా వెళ్ళారు.
అయితే టిడిపి నాయకత్వం అదేపనిగా బుజ్జిగించడంతో పార్టీని వీడే ఆలోచనను సీనియర్ దళిత నాయకుడు విరమించుకున్నారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం, తెలంగాణ ప్రక్రియను ఆపడానికి టిడిపి అధినేత చంద్రబాబు 'బాహటంగా ప్రయత్నాలు' చేయడంతో పసుపు పచ్చ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more