కాంగ్రెస్ పార్టీ మరొ కొత్త డ్రామాకు తెరలేపింది. నిన్నటి వరకు సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు సైలెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. సమైక్యాంద్ర కోసం కోట్లమంది ప్రజలు రాజకీయ నాయకుల పై ఒత్తిడి పెంచినప్పడు వారిలో కొంచెం కూడా చలనం లేదు. కానీ ఇప్పుడు మాత్రం పార్లమెంట్ లో సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు టాప్ రేపుతున్నారు. అదీకూడా సొంత పార్టీపైనే వారు అవిశ్వాసం పెట్టడం అందరికి అనుమానం వస్తుంది. అయితే ఆరుగురు సీమాంద్ర ఎంపీల వెనుక అమ్మ హస్తం ఉందని కొన్ని రాజకీయ పార్టీలు గోల చేస్తున్నాయి. అవును అవిశ్వాసం పెట్టానికి, అమ్మకు ఏమిటి సంబంధం అనే అనుమానం అందరికి వస్తుంది.
కానీ ఇక్కడే పెద్ద మతలం ఉందని రాజకీయ పార్టీలు అంటున్నాయి. రీసెంట్ గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకున్నారనే విషయం అందరికి తెలిసిపోయింది. అంతేకాకుండా అమ్మకు కూడా బాగా అర్థమైంది. ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తే.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే విషయం నాలుగు రాష్ట్రాల ఫలితాలతో బాగా అర్థమైంది. అది ద్రుష్టిలో పెట్టుకొని, అమ్మ తొందరపడిఆంద్రప్రదేశ్ పై ఒక నిర్ణయం తీసుకున్నందుకు చాలా బాధపడతుంది. ఇప్పుడు కూడా మేలుకోకపోతే పార్టీ తీవ్ర కష్టాల్లో పడుతుందని భావించి, అమ్మ రాష్ట్ర విభజన పై వెనకడుగు వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అందులో బాగాంగానే అవిశ్వాస తీర్మానం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అమ్మ హస్తం ఉండబట్టే సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు ముందడుగు వేసారని వైసీపీ సీనియర్ లీడర్స్ అంటున్నారు. గతంలో సమైక్యాంద్ర కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో గోల గోల చేసిన సందర్భంలో సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు ఎవరు సపోర్టు ఇవ్వాని విషయం వైసీపీ నాయకులు గుర్తు చేశారు. ఇప్పుడు సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టడం వెనుక అమ్మ హస్తం ఉందని అనటంలో ఎలాంటి సందేహం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. దీంతో సోనియా గాంధీ తెలుగు ప్రజల జీవితాలతో చెలకాటం ఆడుతుందని అన్నారు.
అమ్మ చేసిన తప్పును మళ్లీ సరిదిద్దుకోవటానికే ఈ అవిశ్వాస తీర్మానం అని కొన్నిరాజకీయ పార్టీలు బహిరంగంగానే అంటున్నాయి. అవిశ్వాసం తీర్మానం పై ఎలాంటి గోల జరుగుతుందో చూడాలి. ఎందుకంటే .. ఈ ఆరుగురు ఎంపీలు .. అమ్మకు అత్యంత ప్రీతికరమైన భక్తులు. అమ్మ మాటలకు ఎదురుచెప్పాని స్వామి భక్తిలో వీరిలో పుష్కలంగా ఉందనే విషయం అందరికి తెలుసు. కాబట్టి అమ్మకు భజన చేసే నాయకులే.. పార్టీ పై అవశ్వాసం పెట్టడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంటే ఎవడైన కూర్చున్న కొమ్మను గొడ్డలితో.. నరుక్కుంటాడా? చెప్పాండి? ఇప్పుడు ఇది కూడా అంతేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more