tdp leader somireddy chandramohan reddy praises ktr and makes controversial comments on ys jagan | ap capital city amaravathi

Somireddy chandramohan reddy praises ktr and comments on ys jagan

somireddy chandramohan reddy, somireddy chandramohan reddy press conference, somireddy chandramohan reddy press meet, ktr, telangana minister ktr, ys jagan, ys jagan controversial comments, jagan mohan reddy news, ys jagan latest updates, ys jagan news, ys jagan controversies, ap capital inauguration, amaravthi inauguration

somireddy chandramohan reddy praises ktr and comments on ys jagan : tdp leader somireddy chandramohan reddy praises ktr and makes controversial comments on ys jagan.

జగన్ కంటే కేటీఆరే ఎంతో బెస్ట్!

Posted: 10/15/2015 06:51 PM IST
Somireddy chandramohan reddy praises ktr and comments on ys jagan

టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరుధ్యాలు ఎంతటి స్థాయిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై విమర్శలు చేసుకోవడమే ఆ రెండు పార్టీల నేతలు పనిగా పెట్టేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా సఖ్యతగా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో రాజధాని శంఖుస్థాపనకు సంబంధించిన పనులు జరుగుతున్న నేపథ్యంలో.. ఇరురాష్ట్రాల మంత్రులు దగ్గరతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ కూడా తనని ఆహ్వానిస్తే కచ్చితంగా రాజధాని శంఖుస్థాపనకు వెళ్తానని ప్రకటించిన విషయం తెలిసిందే! దీంతో.. ఏపీ మంత్రులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా.. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే తీసుకోవచ్చు.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తాను రాష్ట్ర రాజధాని శంఖుస్థాపనకు హాజరు కానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. సోమిరెడ్డి ఆయనపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో జగన్ కంటే కేటీఆర్ బెస్ట్ అంటూ కితాబిచ్చారు. తొలుత జగన్ పై సోమిరెడ్డి నిప్పులు చెరుగుతూ.. రాష్ట్ర రాజధానికి శంఖుస్థాపన జరగడాన్ని కూడా జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రితర్వాత అంతటి స్థానం (ప్రతిపక్ష నేత)లో వున్న వ్యక్తిలా జగన్ ప్రవర్తించడం లేదని, అతని వ్యక్తిత్వం చిన్నపిల్లాడిలా తలపించే విధంగా వుందని ఎద్దేవా చేశారు. శంఖుస్థాపనకు హాజరు కాలేనని జగన్ ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడుతూ.. అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానిస్తే తాను తప్పకుండా హాజరవుతానని చెప్పిన సంగతిని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలున్నప్పటికీ.. కేటీఆర్ వస్తానన్నారని.. జగన్ కంటే ఆయనే బెస్ట్ అని సోమిరెడ్డి అన్నారు.

వైఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సెజ్ ల పేరుతో వేలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కున్నారని, అలాంటి వ్యక్తులకు అమరావతి గురించి మాట్లాడే హక్కులేదని విమర్శించారు.రాజకీయంగా ఎన్నో వైరుధ్యాలున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో కలిసి ముందుకు పోవాల్సి వుంటుందని సోమిరెడ్డి సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravathi inauguration  somireddy chandramohan reddy  ys jagan mohan reddy  ktr  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more