జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి తాను ముందుంటాన’నని ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన ఆందోళన పరిస్థితుల్లో పవన్ ప్రజల్లోకి రాకుండా ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించడంపై ప్రజలతోపాటు కొందరు నేతలు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడటం లేదంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై మాలమహానాడు నేత కారెం శివాజీ మండిపడ్డారు.
ప్రత్యోక హోదాకోసం బీజేపీకి వ్యతిరేకంగా పవన్ పోరాడాలని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని శివాజీ అన్నారు. కేవలం ట్విటర్ లో కాకుండా ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని సూచించారు. అసలు పవన్ ఉద్దేశం ఏంటో తెలియక ప్రజలు అయోమయంలో వున్నారని శివాజీ వ్యాఖ్యానించారు. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానని ఆనాడు పేర్కొన్న పవన్.. ఇప్పుడెందుకు మౌనంగా వున్నారో సమాధానమివ్వాల్సిందేనని ఆయన కోరారు. మరి.. ఈయన వ్యాఖ్యలపై జనసేన పార్టీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో, పవన్ సమాధానమేంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more