అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కాకముందు దేశంలో జరిగిన అన్యాయాలను గుట్టురట్టు చేస్తానంటూ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసిన విషయం తెలిసిందే! కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాములు, సోనియాగాంధీ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను బట్టబయలు చేసి వారికి రాత్రింబవళ్లు నిద్రలేకుండా చేశాడు కేజ్రీవాల్! అంతేకాదు.. గతేడాది ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ ను పక్కనపెట్టి నరేంద్రమోదీని కేంద్రంగా చేసుకుని ఆయన అక్రమాలను బట్టబయలు చేస్తానంటూ గుజరాత్ కు బయలుదేరాడు. అక్కడ మోదీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి తీవ్ర పరాభావాన్ని ఎదుర్కోవడం జరిగింది. అంతే! అప్పటి నుంచి మోదీ, కేజ్రీ వార్ మొదలైంది.
ఈ క్రమంలోనే వారిద్దరు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు, ఆరోపణలు చేసుకోవడం మొదలయ్యాయి. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారణాసిలో మోదీకి ధీటుగా కేజ్రీవాల్ నిలిచారు కానీ.. అక్కడి జనాలు మోదీకే జైకొట్టారు. ఇక చివరగా మిగిలిన ఢిల్లీ మీదే మళ్లీ తన పట్టు సాధించాలన్న ఆశతో కేజ్రీవాల్ పక్కా ప్రణాళికలు రచించి.. ఎట్టకేలకు ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఇక బీజేపీ మీద అత్యధిక సీట్లతో గెలుపొందడంతో కేజ్రీవాల్ బీజేపీని కేంద్రంగా చేసుకుని ఆ పార్టీకి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. ఇప్పుడు తాజాగా మోదీని మరోసారి సవాల్ చేస్తూ.. ఆయనకంటే తనే బాగా పరిపాలిస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మోదీకన్నా తాను మెరుగైన పాలన అందించగలనని అన్నారు. మోదీ పాలన మాత్రం బడా బాబులను కేంద్రంగా చేసుకుని నడుస్తోందని విమర్శించిన కేజ్రీ... ‘ఆప్’ పార్టీ ప్రజలను కేంద్రంగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తోందని చెప్పారు. పార్టీలోని అంతర్గత విబేధాలు సమసిపోయానని, తాను కేవలం ఢిల్లీ ప్రజల సమస్యలపైనే దృష్టి పెడుతున్నానని తెలిపారు. 8 నెలల మోదీ పాలనకన్నా 49 రోజుల కేజ్రీవాల్ పరిపాలన మెరుగైందని ప్రజలు భావించిన తరుణంలోనే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లు తమవెంట నిలిచారని వెల్లడించారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more