తెలంగాణ పై ఈరోజు గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు.
* ఈ బృందానికి ఇదే చివరి సమావేశమని అందరూ భావిస్తుండగా, కాదని గులాం నబీ ఆజాద్ సమావేశం ముగిసిన పది నిమిషాలకు మీడియాకు తెలిపారు.
* అసలే సమయం తక్కువ ఉంది, ఈరోజే తెలంగాణాపై మంత్రుల సమావేశం చిట్టచివరి సమావేశం అనుకున్నారు. కాని మళ్లీ రేపు కూడా మరో సమావేశం జరగవచ్చునని ఆజాద్ వెల్లడించడంతో రేపు ఏం జరగబోతోందని అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది.
* ఈరోజు సమావేశానికి సుశీల్ కుమార్ షిండేసహా ఇంకా నారాయణ స్వామి, జై రాం రమేశ్, చిదంబరం, ఆంటొనీ, దిగ్విజయ్ సింగ్, మొయిలీ, గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు.
* తెలంగాణాకు సంబంధించిన ముసాయిదా సిద్ధం కావడంతో ఇక దానిపై అందరూ సంతకాలు చేయడంతో ఈ సమావేశం ముగుస్తుందని భావించారు.
* ఇక రేపు ఉదయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు ఈ ముసాయిదాను అందజేయడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో రేపు మళ్లీ జీఓఎం సమావేశం జరగవచ్చునని ఆజాద్ చెప్పడంతో ఇది మళ్లీ వాయిదా పడేటట్టు కనిపిస్తున్నది.
* తెలంగాణవాదులు ఏం కోరితో అది అడిగినదే తడవుగా చేస్తున్నారు గాని మా గోడు వినిపించుకోరేమని కేంద్ర మంత్రి పల్లం రాజు ఒక లేఖ రాయడంతో కేంద్ర మంత్రుల బృందం సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులకు తమ గోడు వినిపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నది.
* ఉరి వేసే ముందు సైతం నేరస్థునికి తన చివరి కోరిక చెప్పుకునే అవకాశం ఇస్తారు, మాకు ఆమాత్రం ఇవ్వరా అని పల్లంరాజు తమ లేఖలో ప్రశ్నించడంతో ఈ అవకాశం కల్పించారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more