* తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం మీడియా ముందు మాట్లాడటం జరిగింది.
* రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాద్పై ఎలాంటి ఆంక్షలను అంగీకరించేదిలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంతిగా కాదు, కాపలా కుక్కగా ఉంటానని కేసిఆర్ స్పష్టం చేశారు.
* దేశంలో ఇప్పటి వరకు 28 రాష్ట్రాలు ఏర్పాడ్డాయని, తెలంగాణతో 29వ రాష్ట్రం అవుతుందని, 28 రాష్ట్రాలకు ఎలాంటి సర్వాధికారులు ఉన్నాయో తెలంగాణకు అలాంటి అధికారాలే ఉండాలని, వాటికి లేని ఆంక్షలు తెలంగాణకు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు.
* కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం వద్దని తీవ్ర ఒత్తిడి వస్తోందని, ప్రస్తుతానికి విలీనం అంశం పక్కనపెడదామని, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కేసీఆర్ నేతలకు పిలుపునిచ్చారు.
* భారీ వర్షాలవల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకోవడంలో సీఎం కిరణ్ వివక్ష చూపుతున్నారని ఆయన విమర్శించారు.
* హైదరాబాద్ పట్టణం శాంతికి, సహనానికి చిహ్నమని, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాలని, హైదరాబాద్ అంశంలో స్పష్టత ఇవ్వాలని జీవోఎంను కోరుతామని కేసీఆర్ పేర్కొన్నారు.
* కేకే నాయకత్వంలో పార్టీ తరపున జీవోఎంకు నివేదిక ఇస్తామని, నవంబర్లో టీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుదని కేసీఆర్ తెలిపారు.
* భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ప్రభుత్వం వెంటనే పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఈ విపత్తులో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
* వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సాయం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ తరపున ఐదు బృందాలను ఏర్పాటు చేశామని, కరీంనగర్, మంచిర్యాలలో పర్యటనకు వినోద్, కేసీఆర్, నల్లాల ఓదేలు, కావేటి సమ్మయ్య బృందం వెళ్తుందని, నల్లగొండ, మెదక్కు హరీష్రావు, వరంగల్కు ఈటెల రాజేందర్, కరీంనగర్కు వివేక్, నిజామాబాద్, ఆదిలాబాద్కు పోచారం శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్కు మందా జగన్నాథం, వరద ప్రాంతాలకు నేను (కేసీఆర్), కేకే కూడా వెళ్తామని కేసీఆర్ ప్రకటించారు.
* తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు స్క్రూ లూజయిందని, మతి భ్రమించిందని కేసీఆర్ అన్నారు.
* ఓ పత్రికలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కావని అన్నారు. తెలంగాణను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని ఇక్కడి ప్రజలకు ఎప్పుడో అర్ధమైందని కేసీఆర్ పేర్కొన్నారు.
* సమన్యాయం కోసం ఆయన పోరాటం చేస్తున్నారని, సమ న్యాయం అంటే ఏమిటో ఆయన చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
* తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్సింగ్కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more