కావూరికి సమైక్య సెగతో బాగా కాలింది. దీంతో మంత్రిగారు కేకలు పెట్టారు. గతంలో మంత్రి కావూరి సాంబశివరావు గారు పచ్చి సమైక్యవాది. పదవి రాకముందు ఆయన శరీరంలో ఎక్కడ గిల్లిన .. సమైక్య రాగం వినిపించే. కానీ అమ్మ అనుగ్రహించి, బట్టలు నేసే వారి మీద (జౌళి శాఖ) మంత్రిగా నియమించింది. అంతే అదే పెద్ద వరంగా భావించి, అమ్మ మాటలకు లోపడిపోయి, సమైక్యరాగాన్ని అటకెక్కించాడు. ఎవరైన సమైక్యవాదులు కనిపిస్తే చాలు.. జై సమైక్యాంద్ర అంటూ , ఒకటి రెండు సార్లు జై కోడుతూ.. ఏలూరికి, ఢిల్లీకి చకర్లు కొడుతున్నాడు.. అయితే రాష్ట్ర విభజనను అడ్డుకోవటంలో విఫలమైన కావూరి పై సీమాంద్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కావూరి రాక కోసం ఆ ఊరి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొంతమంది సమైక్యవాదులు కావూరి కోసమే కోడి గుడ్లు డజన్లు డజన్లు కొని పెట్టున్నారు. అంటే కోడి గుడ్డు రేటు రోజు రోజకి ధర పెరుగుతుంది కాబట్టి.. ముందుగా గానే సమైక్యవాదులు కోడిగుడ్లు కొనిపెట్టుకున్నారు. మంత్రిగారు ఎప్పుడు వస్తే అప్పుడు కోడి గుడ్లతో స్వాగతం పలకటానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఈరోజు కావూరి అధికార కార్యక్రమంలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న సమైక్యవాదులు కావూరి పై దాడి చేశారు. కావూరి పర్యటనను సమైక్యవాదులు అడ్డుకుని... ఆయన వాహనంపై కోడిగుడ్లతో దాడి చేసి... వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతే కావూరికి ఎక్కడో కాలిపోయింది. వెంటనే సమైక్యవాదులు వట్టి వెధవలు, చేతకానివారంటూ కావూరి సాంబశివరావు తన నోటి దురుసును ప్రదర్శించారు.
సమైక్యవాదులు మాత్రం కావూరి మాటలకు ఇంకా రెచ్చిపోయి, కోడి గుడ్లతో మరోసారి దాడి చేయటం జరిగింది. కావూరి మంత్రి పదవికి రాజీనామా చేయకుండా, తాత్సరం చేయడం వల్లే కేంద్రం విభజన విషయంలో ముందుకు వెళ్తుందని సమైక్యవాదులు ఆరోపించారు. దాంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన కావూరి ... సమైక్యవాదులపై ఇష్టం వచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నారు. కావూరి పడుతున్న ఇబ్బందులను పోలీసులు గమనించి వెంటనే రంగంలోకి దిగి సమైక్యవాదులపై లాఠీచార్జీ చేశారు. దీంతో పోలీసులు, సమైక్యవాదుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమైక్యవాదులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. సమైక్య సెగ నుండి తప్పించుకున్న కావూరి తిన్నగా ఇంటిబాట పట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more