సీఎం దారిలో అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రోజు రోజుకి క్యూ కడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్రాన్నికి మొట్ట మొదటి సీఎం అయ్యే వారి సంఖ్య పెరుగుతుంది. ఎవరికి వారే ముందుగానే.. సీఎం పదవి పై కర్చీఫ్ వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ సీఎం రేసులో కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, సమాచార శాఖ మంత్రి డీకే అరుణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి పేర్లు విన్పించగా తాజాగా కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ ఉపాధ్యక్షుడు మర్రిశశిధర్రెడ్డి కూడా చేరారు. తెలంగాణలో సీఎం పదవి రేసులో వయసు మళ్లిన గుర్రాలు రేస్ కి సిద్దమవుతున్నాయి.
మర్రి శశిధర్ రెడ్డి మాత్రం కొత్త దారిలో సీఎం పదవి రేసుకు సిద్దమవుతున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లి స్థానాలు పెంచాలనే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చి తెలంగాణలోని నేతల్ని ఆయన సమీకరించారు. వీరిలో కొందరు సమస్యపై చర్చించటానికి వస్తే కొందరు నేతల్ని మాత్రం ఆయన ప్రత్యేకించి సమీకరించారని అంటున్నారు. కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సమాచార శాఖ మంత్రి డీకే అరుణ, ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు ఈ భేటీకి పాల్గొన్నారు
ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లి ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెంచాలనే ఎజెండాతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిపైనే ప్రధానంగా చర్చించారు. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండేను కలవాలని నిర్ణయించారు. ప్రతి ఎంపీ సీటుకీ రెండు అసెంబ్లి సీట్లు పెంచాలన్నది వారి ప్రతిపాదనగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ఎంపీ నియోజకవర్గంలో 7 అసెంబ్లి సీట్లు ఉండగా వాటిని తొమ్మిదికి పెంచాలని కోరుతున్నారు. గతంలో కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఉత్తరాఖండ్లో సీట్లు సంఖ్యను పెంచారని సమావేశం మర్రి వివరించారు. ఆయన ఇప్పటికే ఈ ప్రతిపాదనపై జీఓఎంకు అందచేశారు.
టీ నేతలు గతంలో జీవోఎంకి ఇచ్చిన నివేదికలో చేర్చకపోవటం మర్రి శశిధర్రెడ్డి ఆ విషయాన్ని తెరపైకి తీసుకురావటం ఆయనకు కలిసొచ్చిందంటున్నారు. ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన నేతల్ని సమీకరిస్తున్నారు. ఈ డిమాండ్పై ఇతర పార్టీ నేతల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని మర్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని నేతలు ఈ సమావేశంలో చురుకుగా పాల్గొనటం కూడా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేసులో మీరు ఉన్నారా అని ప్రశ్నించగా మర్రిస్పందిక ముందే కేంద్ర మంత్రి బలరాం నాయక్ జోక్యం చేసుకుంటూ మర్రి సీఎం రేస్లో ఉంటారని ప్రకటించటం యాధృచ్చికం కాదంటున్నారు.
అయితే ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న పేర్లకు భిన్నంగా ఒక కేంద్ర మంత్రి ప్రతిపాదనతో మర్రి రేసులోకి వచ్చారు. కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమేనంటున్నారు సీనియర్లు. కాంగ్రెస్ పార్టీ ఎవర్ని నిర్ణయిస్తే వారే సీఎం అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి సిఎం పదవి విషయంలో .. రోడ్డునపడ్డ ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more