Tdp errabelli latest comments on tdp telangana letter

TDP Errabelli Latest Comments On TDP Telangana Letter, Errabelli on TDP Telangana Letter, TDP chandrababu naidu, seamandhra tdp leaders, ap bifurcation, samaikyandhra, telangana tdp leaders, congress party, 2014 election,

TDP Errabelli Latest Comments On TDP Telangana Letter, Errabelli on TDP Telangana Letter

మా సారు లొంగరు .. కానీ భయమేస్తుంది?

Posted: 11/05/2013 03:41 PM IST
Tdp errabelli latest comments on tdp telangana letter

తెలుగుదేశం పార్టీలో విభేదాలు కొంత ముదురుతున్నట్లుగా ఉన్నాయి. టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు పార్టీ అదినేత చంద్రబాబునాయుడుపై సీమాంధ్ర ప్రాంత నేతల ఒత్తిడి తమకు భయం కలిగిస్తోందని వ్యాఖ్యానించడం విశేషం. రాష్ట్ర విభజనపై బాబు వెనక్కి వెళ్లరనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యమంటూ సీమాంధ్ర టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సరికాదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు

 

కాగా తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు ఈరోజు ఉదయం ఎన్టీఆర్ భవన్ లో సమావేశం అయ్యారు. 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉండాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయమై రాష్ట్రపతిని కలిసేందుకు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు అపాయింట్ మెంట్ కోరగా.... రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు కుదరదని స్పష్టం చేశాయి. అయితే ఎలాంటి ఒతిళ్లకు చంద్రబాబు లొంగరు అని ఎర్రబెల్లి అంటున్నారు.

 

చంద్రబాబు మొదట ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉంటారని ఎర్రబెల్లి అంటున్నారు. కానీ సీమాంద్ర తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం దూకుడు పెంచి చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చుకున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లకు సరికొత్త భయం పట్టుకుంది. ఒకవేళ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోతే.. మాత్రం తెలంగాణలో తెలుగుదేశం కార్యలయాలకు .. తాళాలు పడతాయని తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయాలకు తాళం పడిన విషయాన్ని తెలుగుదేశం పెద్దలు గుర్తు చేసుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.

 

ఇటీవల కాలంలో.. టిడిపి లో రాష్ట్ర విభజన పై తెలంగాణ తెలుగుదేశం నాయకులు, సీమాంద్ర తెలుగుదేశం నాయకులు మద్య మాటల యుద్దం నడుస్తుంది. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేయటానికి రెఢీ అవుతున్న తరుణంలో.. పార్టీలోని నాయకులు మద్య మాటల యుద్దం జరగటంతో బాబు లో ఖంగారు మొదలైంది. అఖిల పక్షం పేరుతో మళ్లీ కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి దారి తీసిందని చంద్రబాబు అంటున్నారు. అయితే చంద్రబాబు రెండు ప్రాంతాల నాయకులతో చర్చలు జరిపి, రగులుతున్న విభజన మంటలపై.. నీళ్లు చల్లినట్లు సమాచారం. ఏమైన బాబు రెండు కళ్ల సిద్దాంతంతో.. తెలంగాణ తెలుగుదేశం నాయకుల్లో భయం పుష్కలంగా కనిపిస్తుందని మీడియా వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు మాత్రం రెండు ప్రాంతాల నాయకులతో రాజకీయంగా నెట్టుకురావటం చాలా ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏమైన తెలుగుదేశం పార్టీ విషయం పూర్తిగా తెలియాలంటే.. 2014 ఎన్నికల వరకు ఆగాల్సిందే.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more