సత్యాగ్రహానికి కాలం తీరిపోయింది. ప్రభుత్వం దడిచే రోజులు పోయాయి. ఎవరైనా నిరాహార దీక్ష చేస్తున్నారంటే పూర్వకాలంలో ప్రభుత్వం వణికిపోయేది. వాళ్ళడిగేదాన్ని వెంటనే చెయ్యలేకపోయినా కనీసం వాళ్ళని స్వాంతన పరచే ప్రయత్నమైనా చేసేది కానీ సన్నివేశం మారింది. దోమ కుట్టినట్టు కాదు దోమ వాలినట్లుగా కూడా లేదు ప్రస్తుత ప్రభుత్వానికి.
రెండు నెలలు పైగా సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమానికి సమాధానం చెప్పటం లేదు సరికదా రోజుకో మాటతో ఉద్యమకారులనింకా రెచ్చ గొడుతూ తమ పనిని తాము తాపీగా చేసుకుంటూ పోవటం మన ప్రభుత్వానికే చెల్లింది.
సరే, ఉద్యమాలతో కదలికలు రావటం లేదు, కనీసం దీక్ష వలనైనా హృదయ స్పందన వస్తుందేమో చూద్దామనుకుంటే అదీ హుళక్కే అయింది.
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైల్లో ఉన్నప్పుడూ దీక్షలో కూర్చున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చీ మరోసారి దీక్ష చేపట్టారు. ఆ మధ్య కాలంలో ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా దీక్ష చేసారు. మరెందరో నాయకులు దీక్షబాట పట్టారు. ఇవన్నీ విభజనను అడ్డుకోవటం, సమైక్యాంధ్రకు మద్దతునివ్వటం, సీమాంధ్రకు న్యాయం చెయ్యటం కోసం చేసినవే. పోలీసులు రంగప్రవేశం చేయటం, బలవంతంగా హాస్పిటల్ కి తరలించటం, వైద్యోపచారాలు చేయించటంతోపాటు దీక్షను భగ్నం చెయ్యటం. అంతే ఆ కార్యక్రమానికలా స్వస్థి చెప్పటం జరుగుతోంది.
ఇవన్నీ చూసినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. జాతీయ స్థాయి నాయకులు మద్దతును తెలిపారు, రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా తండోపతండాలుగా ఢిల్లీకి తరలి వెళ్ళి మద్దతుగా నిలిచారు. కానీ అదే తంతు. కాకపోతే వాళ్ళు ఢిల్లీ పోలీసులు అంతే. ఆంబులెన్స్ తీసుకుని మరీ ఏపి భవన్ లో చంద్రబాబు దీక్షాస్థలికి వెళ్ళారు, బలవంతంగా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కి తీసుకెళ్ళారు, ఒకరోజంతా చంద్రబాబు నిరాకరించినా చివరకు వైద్యులు తమ పంతం నెగ్గించుకున్నారు. చంద్రబాబు కి ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షా భంగం చేసారు.
దీక్షలకు ప్రభుత్వం లొంగదన్న సంగతిక నాయకులు తెలుసుకోవాలి. పోలీసు యంత్రాంగానికి దీక్షను భంగం చేసే అధికారాలను కట్టబెట్టటం ద్వారా ప్రభుత్వం బేఫికర్ గా ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటూ అధికారంలో ఉన్ననాయకులు చింతపడకుండా ఉంచగలుగుతోంది.
ఎలాగూ జరగని పనికి పూనుకోవటం కూడా దండుగే అన్న అభిప్రాయాన్ని కలిగించటానికి ప్రభుత్వం చేసిన పనులు ఇంకా ఫలితాన్నిచ్చినట్టుగా లేదు. ఇంకా సత్యాగ్రహ దీక్షలో కూర్చుంటున్నారు. ఈ విషయాన్ని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోవటంలేదే అని ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపే నాయకులు బాధపడుతున్నారు కానీ, అది దీక్ష చేసేవారికి కూడా చేయూత నిస్తోంది.
ఇటు దీక్షలో కూర్చోవటం, అటు నుంచి పోలీసులు సమాయత్తమవటం జరగుతుంది కనుక ప్రాణ భయమైతే ఉండదన్న విషయాన్ని దీక్ష చేసేవారికి వారి కుటుంబ సభ్యులు, మద్దతుదార్లకు తెలిసి రావటం వలన నిర్భయంగా దీక్షకు పూనుకుంటారిక. ఇది ఇలాగే సాగితే నిరాహార దీక్ష చేస్తున్నవారు తమకోసం చేస్తున్నారు కానీ మా కోసం కాదు అనే భావన కూడా ప్రజలలో బలపడుతుంది. కాబట్టి నాయకులూ మరో దారి చూసుకోండి. ఈ దారి మూసుకుపోయింది!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more