రాష్ట్రానికి సమైక్యాంద్ర ఉద్యమం సెగ తాకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా రాష్ట్రానికి సమైక్య సెగ కంటే.. మరో బలమైన దెబ్బతగలటానికి రెఢి అవుతుంది. అదే పైలిన్ దెబ్బ. ఈ పైలిన్ దెబ్బకు మన రాష్ట్రంతో పాటు.. ఉత్తరాష్ట్రాలు కూడా వణికిపోతున్నాయి. ఫైలిన్ అంటే.. రీసెంట్ గా బంగాళాఖాతంలో పుట్టిన వాయగుండం. ఈ వాయగుండానికి ‘ఫైలిన్ ’ అనే నామాకరణం చేశారు. ఇప్పుడు ఫైలిన్ తో రాష్ట్రానికి పెద్ద ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం అధికారుల హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో పెను తుపాను పొంచి ఉంది. ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పాడిన తీవ్ర వాయుగుండం ‘మయాబందర్ ’ వద్ద తీరం దాటి రాత్రి తుపానుగా మారే అవకాశాలున్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విశాఖ పట్టణానికి తూర్పు ఆగ్నేయదిశలో 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక్రుతమైంది.
ఈ నెల 12న రాత్రి శ్రీకాకుళం జిల్లాలోని కలింగపట్టనం, ఒడిశాలోని పరదీవ్ లేదా గోపాలపూర్ మద్య తీరాన్ని దాటే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు చెప్పారు . ఈ పైలిన్ తీరం దాటే సమయంలో గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. రాష్ట్రంలోని విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, క్రిష్ణపట్నం, కాకినాడ, గంగవరం, ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను తీవ్రత ద్రుష్ట్యా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఫైలిన్ దెబ్బకు అప్రమత్తమయిన ప్రభుత్వం: ఫైలిన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తమైయింది. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోలు రూములు తెరవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో కూడా కంట్రోలు రూం తెరిచారు. ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే ఏర్పాట్లు చేసినట్లు విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు.
రంగంలోకి దిగిన దళాలు : కోస్తా జిల్లాల్లో తుపాను పరిస్థితులను పరిశీలించడానికి సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించామని, వారు వెంటనే జిల్లాలకు వెళ్లి అధికారులను అప్రమత్తం చేస్తారని మంత్రి రఘవీరా రెడ్డి తెలిపారు. 1500 మంది ఎన్ డిఆర్ ఎఫ్ సిబ్బంది, 50 మంది అగ్నిమాపక నిపుణులు , ఒక హెలికాప్టర్ ను సిద్దంగా ఉంచామన్నారు. విశాఖలో సైనిక, నౌకదళ సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. సీమాంద్రలో సమ్మెల్లో ఉన్న ఉద్యోగులను విధులకు హాజరుకావాలని కోరామని , దానికి వారు అంగీకరించారని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్దమని ఉద్యోగులు చెప్పారన్నారు.
కల్లోలంలో సముద్రం
గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో సముద్రం కల్లోలంగా ఉంది. సముద్రం 50 అడుగుల ముందుకువచ్చింది. బీచ్ రోడ్డును దాటి దుకాణాలను నీరు తాకింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more