హైదరాబాద్లో సమైక్యశంఖారావం పేరిట భారీ సమావేశం నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ అధోగతేనంటూ ప్రజలు ఎదుర్కొనే విభజన సమస్యలను మా పార్టీ పదే పదే కేంద్రానికి వివరిస్తోంది. అందుకు ముహూర్తం నిర్ణయించింది. సమైక్యాంధ్రను కోరుకుంటూ మొదటి నుంచీ అనేక పద్ధతుల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్లో సమైక్యశంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. రాష్ట్ర రాజధానిలో నిర్వహించే సమైక్యశంఖారావం ద్వారా సమైక్యరాష్ట్రం ఆకాంక్షను బలంగా వినిపించనున్నది. విభజన, సమైక్యవాదులందరూ సహకరించి తమ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అయినందున ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. విభజనవాదులు, సమైక్యవాదులు సహకరించాలని ఆయన కోరారు.
ముసుగు తొలగించిన బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన ముసుగు తొలగించారు. వైఎస్ జగన్ హైదరాబాద్ లో సమైక్య శంఖారావం సభ తేదీని ప్రకటించటంతో చంద్రబాబు ఆవేశానికి గురైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, వైసీపీని కాంగ్రెస్ ఆడిస్తోందని, ఢిల్లీలో కాంగ్రెస్ ఇచ్చిన స్ర్ర్ర్కిప్ట్నే ఆ రెండు పార్టీలు వినిపిస్తున్నాయని బాబు ఎద్దేవా చేశారు. కేసీఆర్, జగన్ను ప్రొత్సహించి కాంగ్రెస్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తోందని, ఆ రెండు పార్టీలతో కాంగ్రెస్ లాలూచీ పడిందని ఆయన ఆరోపించారు.
జగన్ తెలంగాణ విషయంలో ఎన్నోసార్లు మాటమార్చాడని, సమైక్యం ముసుగులో విభజనకు జగన్ ప్రయత్నిస్తున్నారని, ఆయన నీతి వాక్యాలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. జగన్ అవినీతి కేసును సీబీఐ నీరు గార్చిందని, క్విడ్ ఫ్రోకో జరగలేని సీబీఐ కోర్టులో పేర్కొందని, కాంగ్రెస్తో మ్యాచ్ పిక్సింగ్ వల్లే ఇవన్నీ జరిగాయని ఆయన ఆరోపించారు. వైసీపీకి, కాంగ్రెస్కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కాబట్టే జగన్కు బెయిల్ దొరికిందని లేకుంటే ఆయన ఇప్పటికీ జైలులోనే ఉండేవాడని చంద్రబాబు తెలిపారు.
జగన్పై ఉన్న కేసులను డైల్యూట్ చేశారని తెలిపారు. బెయిల్ విషయంలో సీబీఐ రాత్రికి రాత్రి మాట మార్చి తెల్లారే సరికి బెయిల్ ఇస్తే అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పరన్నారు. కాంగ్రెస్తో వైసీపీ లాలూచీ పడిందనటానికి ఇదే నిదర్శనమన్నారు. జగన్ ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కూడా యూపీఏతో ఒక్కసారి కాదు వందసార్లు పొత్తుపెట్టుకుంటామని బాహాటంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more