16 నెలల తర్వాత చంచల్ గుడా జైల్ నుంచి వైయస్ జగన్మోహన రెడ్డి విడుదలై బయటకు రావటంతోనే రాష్ట్ర రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చింది.
అసలు రాజకీయాల్లోంచి దూరంగా వెళ్ళలేదన్నట్టుగానే ఉంది జగన్ వ్యవహారం కూడా. జైల్ నుంచి వస్తూనే రాజకీయ పనుల్లో మునిగిపోవటం జగన్ వంతైతే, తెలుగు దేశం పార్టీ మీద మాత్రం గట్టి దెబ్బే పడింది.
రాష్ట్ర విభజన ప్రకటన వస్తూనే హడావిడిగా రాజీనామాలు ఇచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అటు సీమాంధ్ర ప్రజానీకానికి మద్దతుగా ఉన్న సంకేతాలిచ్చారు, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామన్న మాటతో కొద్దికొద్దిగా పుంజుకుంటున్న తెలుగు దేశం పార్టీకీ నష్టం చేకూర్చారు. రాష్ట్ర విభజనకు మద్దతుగా తెదేపా మహానాడులో ప్రకటన చెయ్యటం, కేంద్రానికి లేఖను ఇవ్వటమే అందుకు కారణం.
కానీ ఇప్పుడు అదే శాసన సభ్యులు తెలంగాణా బిల్లును శాసనసభలో పాస్ అవకుండా ఉంచటం కోసం రాజీనామాలను ఉపసంహరించుకుంటామంటున్నారు. ఆ సమయంలో రాజీనామాలూ పనిచేసాయి, ఇప్పుడు ఉపసంహరణలు కూడా మంచే చేస్తున్నాయి.
ఇక తెలంగాణాలో కూడా జగన్ వలన తెలంగాణా రాష్ట్ర సమితి ఆలోచనలో పడింది. కాంగ్రెస్ తో పొత్తు అనివార్యమని భావిస్తోంది. భాజపాతో పొత్తు పెట్టుకుందామంటే ముస్లిం ఓట్లకు గండిపడుతుందనే భయం ఒకటుంది. నిజానికి తెలంగాణా రాష్ట్ర అవతరణకోసం తెరాసతో పాటు భాజపా కూడా పోరాటం సలిపింది, ఇప్పటికీ అదే మాట మీద నిలబడి ఉంది కానీ పొత్తుకు మాత్రం తెరాస జంకుతోంది.
జగన్ మళ్ళీ చురుగ్గా రాజకీయాలలోకి రావటంతో సంభవించిన మరో మార్పు ఏమిటంటే, సీమాంధ్రలో మనదంటూ ఒక పార్టీ పెట్టేసుకుందామా అని ఆలోచనలో పడ్డ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల యోజనకు కూడా అడ్డుకట్టు పడింది.
ఇదంతా కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలకు మంచే చేసింది. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తేట్టుగా చేసింది.
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో వైయస్ ఆర్ కాంగ్రెస్ కి 25 పార్లమెంటు స్థానాల్లో 21 లభిస్తాయని, 175 అసెంబ్లీ స్థానాల్లో 130 లభిస్తాయని తెలుస్తోంది. అంతటితో అయిపోలేదు. తెలంగాణా విషయంలో కూడా జగన్ దగ్గర ఒక వ్యూహం ఉందని, దాన్ని సరైన సమయంలో బయటపెట్టటం జరుగుతుందని వార్త వినిపిస్తోంది.
రాష్ట్ర విభజన పక్షంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన దగ్గర్నుంచి జగన్ విడుదల వరకు జరిగిన ఈ మొత్తం సంఘటనలలో తీవ్రంగా నష్టపోయింది మాత్రం తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. తెలంగాణా విషయంలో ఇదమిద్ధంగా ఒకే బాణీలో మాట్లాడకపోవటమే నని అనుకుంటున్నారు. అందుకే భాజపాతో పొత్తు తప్పనిసరి అవుతుందేమో అని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ వ్యూహమంతా కాంగ్రెస్ దే అంటారు చంద్రబాబు నాయుడు. తెలంగాణాలో తెరాస, సీమాంధ్రలో వైకాపా లు కాంగ్రెస్ పార్టీకి శాఖలు మాత్రమే అంటారాయన.
ఏది ఏమైనా, జైలు నుంచి వచ్చిన జగన్ రాజకీయ రంగంలో దుమారమే లేపారని చెప్పవచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more