దేశంలో ఈ మాత్రం పరిస్థితులున్నాయంటే అది కేవలం న్యాయ వ్యవస్థ చలువ వలనేనని నమ్మేవాళ్ళు దేశంలో అధిక సంఖ్యలో ఉన్నారు. రాజకీయ ప్రయోజనానికే పెద్ద పీట వేసే ప్రభుత్వం దారి తప్పుతున్నదని తెలిసినప్పుడల్లా న్యాయస్థానాలు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రయత్నిస్తున్నాయి. అలా కాకుండా పూర్తిగా న్యాయస్థానాలు కూడా తమ కింది పనిచేసేట్టుగా ఎన్నో రకాల బిల్లులను ప్రవేశపెట్టటానికి ప్రభుత్వం లోగడ యోజనలు చేసింది.
2జి స్పెక్ట్రమ్ విషయంలో తప్పు జరిగిపోయిందని నాలిక కరుచుకుంటూనే తాత్సారం చేస్తున్న ప్రభుత్వం, ప్రభుత్వ నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చెయ్యటంతో బిత్తరపోయింది. ఎన్నో సందర్భాలలో కోర్టుల నుంచి ప్రభుత్వం పట్ల నిరసన వ్యాఖ్యలు కూడా వచ్చాయి.
తాజాగా నేరచరిత ఉన్నవాళ్ళ ఆటలను రాజకీయరంగంలో కట్టించటానికి నడుం బిగించిన సుప్రీం కోర్టు, అవినీతి నేతలను ఎన్నికలలో పోటీ చెయ్యకుండా ఉండటమే కాదు, ఎన్నికలలో గెలిచినవాళ్ళ మీద కూడా వేటు వేసింది. ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు నిరూపితమై, కనీసం రెండు సంవత్సరాల శిక్ష పడ్డట్లయితే అటువంటి వాళ్ళు అనర్హులవుతారని కూడా తెలియజేయటంతో దాన్న జీర్ణించుకోలేకపోయిన ప్రభుత్వం వెంటనే నేర చరితగలవాళ్ళు కూడా ఎన్నికలకు అర్హులేనని అంటూ బిల్లుని పార్లమెంటులో ప్రవేశెపెట్టే ప్రయత్నం చేసి భంగపడింది. ప్రతిపక్షాలు అందుకు ఒప్పుకోలేదు.
అయినా పట్టు విడవని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆర్డినెన్స్ ని పాస్ చెయ్యటం జరిగింది. దాని మీద రాష్ట్రపతి సంతకం పెడితే చాలు, సుప్రీంకోర్టుని ధిక్కరించకుండానే పనులు చేసుకోవచ్చనుకుంది కేంద్ర ప్రభుత్వం. దానితో ప్రతిక్షాలు రాష్ట్రపతికి ఆ పని చెయ్యవద్దని, ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమైనదని అని విన్నపం చేసుకున్నాయి.
ఈ లోపులో సుప్రీం కోర్టు నుంచి మరో సంచలనాత్మకమైన తీర్పు వెలువడింది. అదేమిటంటే ఓటుని తిరస్కరించే హక్కు. ప్రస్తుతం ఎన్నికలబరిలోనున్న వారిలో ఎవరినైనా ఎన్నుకునే అవకాశం ఉంది కానీ తిరస్కార ఓటు ప్రజల చేతిలో మరింత శక్తిని పుంజుకునేదౌతుంది. దీని ద్వారా ఓటర్లు అభ్యర్థులను తిరస్కరించనూ వచ్చు. అప్పుడు మంచి వాళ్ళే ఎన్నికలలో నిలబడగలుగుతారని కోర్టు అభిప్రాయపడుతోంది. ఓటు వెయ్యటం చట్టబద్ధమైన హక్కైతే తిరస్కరించటం ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు తెలియజేసింది. దీనితో పారదర్శకత కూడ పెరుగుతుందని సుప్రీం కోర్టు ఉద్దేశ్యపడుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more