అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వై.ఎస్ జగన్ ఇప్పటివరకు మొత్తం ఏడుసార్లు సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అందులో ఆరు సార్లు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. చివరకు ఏడోసారి జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ ముగిసినందున, షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ 2012 మే 27న అరెస్టయ్యారు. అరెస్టయిన రెండు రోజులకే జగన్ తొలిసారిగా బెయిల్ పిటిషన్ వేశారు. మే 29న తన అరెస్టు అక్రమమని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 1న బెయిల్ నిరాకరిస్తూ జగన్ పిటిషన్ ను సిబిఐ కోర్టు కొట్టివేసింది. 2012 జూన్ 21న జగన్ రెండోసారి బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్ ను కూడా జులై 4న సిబిఐ కోర్టు కొట్టివేసింది. బెయిల్ మంజూరుకు నిరాకరించింది. మూడోసారి బెయిల్ కోరుతూ 2012 జులై 9న పిటిషన్ వేశారు. అదనపు సమాచారంతో జులై 28న అదే బెయిల్ పిటిషన్ ను మళ్ళీ సమర్పించారు. కాని ఆగస్టు 9న జగన్ పిటిషన్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక నాలుగోసారి 2012 నవంబర్ 16న జగన్ రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి రెగ్యులర్ బెయిల్ కాగా, మరొకటి స్ట్రాట్యుటరీ బెయిల్. ఈ రెండింటినీ సిబిఐ కోర్టు కొట్టివేసింది. నవంబర్ 28న కోర్టు ఈ రెండు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఇక ఐదోసారి, సిబిఐ తీర్పును సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. 2012 నవంబర్ 30న బెయిల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కూడా 2013 జనవరి 24న హైకోర్టు కొట్టివేసింది. ఆరోసారి కూడా జగన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2012 ఏప్రిల్ 12న బెయిల్ పిటిషన్ వేశారు. తుది చార్జిషీట్ల విషయంలో సిబిఐ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మళ్లీ అదనపు చార్జిషీట్లు దాఖలు చేస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. కాని అది కూడా విఫలమైంది. మే 9న జగన్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిబిఐ విచారణ పూర్తయ్యాకే బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది. ఇక చివరిసారి 2013 సెప్టెంబర్ 11న సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ వేశారు. సిబిఐ విచారణ పూర్తయినందున, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 23న జగన్ కు బెయిల్ మంజూరు చేస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.మొత్తానికి ఆరుసార్లు జగన్ విఫలమైనా, చివరిగా ఏడోసారి బెయిల్ దక్కించుకున్నారు.
ప్రజల దీవెనలు ఫలించాయి. పదహారు నెలలుగా తమ నాయకుడి కోసం ఎదురుచూస్తున్న అభిమానుల గుండెలు ఆనందంతో నిండిపోయాయి. భర్త దూరమైన బాధనుంచి కోలుకోకముందే... కొడుకును కుట్రలు నిర్బంధించినా... పెద్ద బాధ్యతను భుజానికెత్తుకుని పోరాడిన ఆ తల్లి ఓర్పుకి తగిన ఫలితం లభించింది. అన్న ప్రతినిధిగా ప్రజల మధ్యకు సుధీర్ఘ ప్రయాణం చేసిన చెల్లెలు ప్రస్థానానికి తగిన న్యాయం జరిగింది. కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు అభిమన్యుడు కాదు... జనమందరిలో ఒకడని... జననాయకుడని ఎలుగెత్తిన రోజు వచ్చింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి ఈ సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు జగన్ కు నిన్న సాయంత్రం బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు కోరిన షూరిటీలు సమర్పించిన తరువాత జగన్ విడుదల ఉత్తర్వులపై న్యాయమూర్తి దుర్గాప్రసాద్ రావు ఈరోజు సంతకం చేశారు. కోర్టు సిబ్బంది ఆ ఉత్తర్వులను చంచల్గూడ జైలు అధికారులకు అందజేశారు. కోర్టు ఆదేశాలను పరిశీలన తర్వాత జైలు అధికారులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విడుదల చేశారు.
గతంలో ఉన్న విధంగా ప్రభుత్వం బులెట్ ప్రూఫ్ వాహనాన్ని, భద్రతా సిబ్బందిని సమకూర్చింది. జగన్ విడుదల సందర్భంగా జగన్మోహన రెడ్డికి అభిమానులు పూలతో ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు తోచుకువచ్చారు. కిక్కిరిసిన జనంలో నుంచి వాహనం కదలడం కూడా కష్టమైపోయింది. ఎటు చూసినా జనమే జనం. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. జై జగన్ అన్న నినాదాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. 485 రోజులు జైలులో ఉండి, బయటకు వచ్చిన యువనేతను చూసేందుకు యువత ఉత్సాహంగా తోసుకొనితోసుకొని ముందుకు వస్తున్నారు. చిరునవ్వుతో అందరికీ రెండు చేతులు జోడించి అభివాదం చేస్తున్నారు. జైలు నుంచి ఆయన వాహనం వెళ్లే రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కాన్వాయ్ వెంటే జనం నడుస్తున్నారు. జైలు వద్ద నుంచి ఆయన నివాసం లోటస్ పాడ్ వరకు రోడ్డుకు ఇరువైపుల జనం బారులు తీరి ఉన్నారు. ఆ జనవాహినిని తప్పించుకొని ఆయన ఇంటికి చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more