వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో సిబిఐ వారు భయపడుతున్నారా? అంటే అవుననే విధంగా ఈ రోజు సిబిఐ లాయర్ వాధించిన తీరే అర్థం అవుతుంది. వైఎస్ జగన్ బయటకు వస్తే .. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు సహజంగా భయం ఉంటుంది. కానీ సీబీఐ వారి కూడా భయం ఉంటుదని ఈరోజు అర్థమైంది. జగన్ కేసు చివరి దశలో ఉందని, ఈ సమయంలో జగన్ కు బెయిల్ ఇస్తే.. మా పని ఖాతం అని లాయర్ అన్నారు అంటే.. జగన్ ప్రభావం ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ రోజు జగన్ కు బెయిల్ వస్తుందని చంచల్ గూడ జైలు అధికారులు కూడా రిలాక్స్ గా ఉన్నారు. జగన్ కు బెయిల్ వస్తే, మాకు కాస్త రిలీఫ్ దొరుకుతుందని పోలీసు అధికారులు భావించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు దాదాపు పూర్తి కావోస్తుందని, ఒకటి.. రెండు అంశాలలో దర్యాప్తు జరుగుతోందని, అయినా దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ తన కౌంటర్ లో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని, జగన్ పలుకుబడి ఉన్నందున సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. దర్యాప్తులో ఇంకా ఒకటి రెండు అంశాలు మిగిలి ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఇదే విషయాన్ని సీబీఐ తనపు న్యాయవాది కోర్టులో కూడా వాదిస్తూ జగన్ కు బెయిల్ ఇస్తే సిబిఐ పని ఖతం అని ఘాటుగానే చెప్పారు. ఇక సిబిఐ కూడా కౌంటర్ లో.. జగన్ చెప్పుకుంటున్నట్లు ఆయన నిరపరాధికాదని.. ఆయన నేరంపై ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ కేసులో ఇంకా విచారణ జరగవలసి ఉందని, జగన్ కు బెయిల్ ఇవ్వటం సమంజసం కాదని పేర్కొంది. ఇక కోర్టులో జగన్ తరపు న్యాయవాది జగన్ విచారణకు పూర్తిగా సహకరిస్తాడని, జగన్ జైలులో ఏడాదికి పైగా గడిపాడని అతనికి ఆరోగ్యసమస్యలు కూడా వస్తాయని, రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నందున పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాల్సి ఉందిని వాదించారు. అయితే కోర్టు తీర్పను ఈ నెల 23కు వాయిదా వేసింది. జగన్ బెయిల్ మీద ఎన్ని వాయిదాలు పడిన, సంవత్సరాల రోజు చంచల్ గూడ జైల్లో ఉన్నప్పటికి.. వైఎస్ జగన్ ముఖంలో మాత్రం చిరునవ్వు చెరగలేదని సిబిఐ లాయర్లు, పోలీసు అధికారులు అంటున్నారు. అంటే ఆ చిరునవ్వు వెనుక ఉన్న మర్మం ఏమిటో మాత్రం ఎవ్వరికి అర్థం కావటం లేదని పోలీసులు అధికారులు అంటున్నారు. ఆ చిరునవ్వు వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈనెల 23 వరకు ఆగాల్సిందే..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more