సిబిఐ ఈ రోజు జగన్ అక్రమాస్తుల కేసులో మూడు ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. వాటిలో ప్రధాన నిందితులు వైస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. వరాలిచ్చింది వైయస్ ప్రభుత్వం ముడుపులు వచ్చి చేరింది జగన్ సంస్థలలో.
ఛార్జ్ షీట్ల ప్రకారం, ఇండియా సిమెంట్స్ సంస్థ జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, కార్మెల్ ఏసియా సంస్థలలో పెట్టిన 140 కోట్ల రూపాయల పెట్టబడి మొత్తం లంచాలేనని సిబిఐ తన దర్యాప్తులోతేల్చి చెప్పింది. ఇండియా సిమెంట్స్ కి అందుకుగాను కాగ్నా నదీజలాల వినియోగానికి అనుమతి లభించింది.
పెన్నా సిమెంట్స్ జగతి పబ్లికేషన్స్ లోనూ, కార్మెలమ ఏసియాలోనూ రూ.68 కోట్ల పెట్టుబడి పెట్టింది. అందుకుగాను పెన్నాకి కర్నూల్, రంగారెడ్జి జిల్లాలలో సున్నపురాయి గనులను ధారాదత్తం చెయ్యటం జరిగింది. అంతే కాకుండా అనంతపురం జిల్లాలో 230 ఎకరాల భూమిని కేటాయించటం జరిగింది.
కడప జిల్లాలో రఘురాం సిమెంట్స్ నుంచి 475 ఎకరాల భూమి భారతి సిమెంట్స్ కి బదలాయింపు జరిగింది. ఇది అక్రమమైన పద్ధతిలో జరిగిందని సిబిఐ తన నివేదికలో పేర్కొంది. భారతి సిమెంట్స్ కి కేటాయించిన 120 ఎకరాల భూమికి ప్రభుత్వం తరఫున ఎన్నో రకాల మినహాయింపులు లభించాయి.
నిమ్మగడ్డ ప్రసాద్, దాల్మియా సిమెంట్స్ భారతి సిమెంట్స్ లో రూ.244, రూ.95 కోట్లను పెట్టుబడిగా పెట్టారు.
పైన పేర్కొన్న అభియోగాలన్నిటిలోనూ జగన్, విజయసాయి రెడ్డి ప్రధాన నిందితులని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పేర్కొంది.
సిబిఐ అభియోగాలలో మంత్రుల పేర్లను ప్రస్తావించకపోవటం విశేషం.
ఇండియా సిమెంట్స్ ఛార్జ్ షీట్ లో నిందితులు- జగన్, విజయసాయి రెడ్డి, శ్రీనివాసన్, ఐఏఎస్ ఆదిత్యనాథ్, శామ్యూల్, రఘురాం సిమెంట్స్, కార్మెల్ ఏషియా, జగతి పబ్లికేషన్స్.
భారతి సిమెంట్స్ ఛార్జ్ షీట్ లో నిందితులు శంకరనారాయణ, ప్రభు, రఘురామ్ సిమెంట్స్
పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్ లో నిందితులు జగన్, ప్రతాప్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ప్రభుదాస్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా, పిఆర్ ఎనర్జీ, పయోనర్ ఇన్ ఫ్రాలు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more