చేతలు కాలుతున్నాయి.. ఆకులు పట్టుకోవాల వద్దా అనే ఆలోచనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉన్నట్లు సమాచారం. తొందరపడి తప్పుచేశాం అనే నిర్వేదంలో సోనియాగాంధీ ఉన్నట్లు ఢిల్లీ పెద్దలు అంటున్నారు. సీమాంద్ర నాయకులు యూ టర్న్ తీసుకుంటున్నారు. విభజన ప్రకటన చేసిన సోనియా గాంధీ పరిస్థితి ఆందోళనకారంగా ఉందని అంటున్నారు. సమైక్య సెగలు ఉధృతంగా తాకుకుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేని స్థితిలో ఆమె పడ్డారు. యుపిఎ ప్రభుత్వంతో పాటు కాంగ్రెసు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లే. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదికి వచ్చారు. మరోవైపు సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులు కూడా ఆందోళనలో అడుగుపెట్టారు. వారిని చల్లార్చడం ఎలాగో కాంగ్రెసు అధిష్టానానికి దిక్కు తోచడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులే కాకుండా సొంత కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నాయకులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు కూడా మడతపేచీ పెడుతున్నారు.
సొంత పార్టీ నాయకులనే అదుపు చేయలేని స్థితిలో కాంగ్రెసు అధిష్టానం పడింది. ఇప్పుడు సోనియాగాంధీ పద్మవ్యూహంలో చిక్కిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందడుగు వేయడం ఎలాగనేది సంకటపరిస్థితే. అలాగని వెనకడుగు వెయ్యాలనే పరిసిత్తిలో కొట్టుమిట్టుతున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం, పదేళ్ల పాటు మాత్రమే హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచడం మినహా మరో విధంగా ముందుకు సాగలేని స్థితి ఉంది. తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలను చల్లబరచడానికి వేసిన ఆంటోనీ కమిటీ కూడా ఫలితం సాధించే అవకాశాలు కనిపించడం లేదనే విషయం సోనియా గాంధీకి తెలిసిపోయింది. కాంగ్రెసుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సమైక్యాన్ని తప్ప మరోదాన్ని అంగీకరించేది లేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నుంచి వెనక్కి తగ్గకుండా సీమాంధ్ర నాయకులను, ప్రజలను ఊరడించే మార్గం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.
రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు జరగదని, వచ్చే ఎన్నికల తర్వాత తమకు మెజారిటీ వస్తే చేస్తామని, కానీ తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెసు అధిష్టానం ప్రకటిస్తే గుడ్డిలో మెల్లలా పరిస్థితి చక్కబడవచ్చు అంటున్నారు. కానీ పార్టీగా కాంగ్రెసు తీవ్రంగా నష్టపోతుందని ఆ నాయకులే సూచిస్తున్నారు. అయితే రెండోసారి కాంగ్రెసు చేతిలో మోసపోయామనే భావన తెలంగాణ ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతుంది. దీంతో తెలంగాణలో మళ్లీ ఉద్యమ సెగలు జోరందుకుంటాయి. కానీ విభజన విషయం పై సోనియా గాంధీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు సమాచారం. ఒక్కసారిగా సీమాంద్ర నాయకులు యూ టర్న్ తీసుకొని.. కొత్త పార్టీ పెడితే.. కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? బిజేపి పార్టీ పుంజుకుంటుందన సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఆంద్రప్రదేశ్ లో ఆటకెక్కినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విభజన పై సోనియా గాంధీ , ఆంటోని కమిటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అప్పటి వరకు సీమాంద్ర సెగలు రేగుతూనే ఉంటాయని సీమాంద్ర నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more