425 సంవత్సరాల చరిత్ర గల హైద్రాబాద్ నగరం వివాదాలకు కేంద్ర బిందువై ఆ విధంగా చరిత్రకెక్కుతోంది.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతూ ఉద్యమం చేసిన తెలంగాణా రాష్ట్ర సమితి తమకు తమ 10 జిల్లాలతో పాటుగా హైద్రాబాద్ నగరాన్ని కలిపి రాష్ట్ర ఏర్పాటును చెయ్యమని కోరుకుంటోంది. హైద్రాబాద్ లేని తెలంగాణాకు సమ్మతించం, హైద్రాబాద్ కావలసిందే అని పట్టుబడుతోంది.
అందుకు అనుకూలంగానే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటనలను చేస్తోంది. అయితే హైద్రాబాద్ నగరాన్ని 10 సంవత్సరాల కాలం ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకోమని, ఈలోపులో ఆంధ్రావాసులు తమ కొత్త రాజధానిని నిర్మించుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించటం జరిగింది. దానితో సీమాంధ్రలో ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి.
హైద్రాబాద్ నిర్మాణంలో రాష్ట్ర ప్రజలందరి కృషీ ఉందని, ఇంతకాలం అభివృద్ధి పరచిన నగరాన్ని ఎలా వదులుకుంటామని సీమాంధ్రవాసులు ఆందోళన చేస్తున్నారు.
హైద్రాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించమంటూ కొందరు ఆశిస్తుండగా, అందుకు అసలు అంగీకరించటం కుదరదంటూ మజ్లీస్ పార్టీ గట్టిగా చెప్తోంది. హైద్రాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా కానీ లేదా రాష్ట్ర విభజన జరిగి తెలంగాణాకు శాశ్వత రాజధానిగా కానీ ప్రకటించినట్లయితే పెద్ద దుమారమే రేగుతుందంటూ మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి హెచ్చరికలు చేసారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చే అవకాశాలున్నట్టుగా ఆ పార్టీ కంటే ఎక్కువగా మజ్లీస్ పార్టీకే నమ్మకాలు లేదా భయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. అందుకే హైద్రాబాద్ ని వదులుకోవటం కానీ, లేదా భాజపాకి అధికారంలోకి రావటానికి ఇష్టపడని మజ్లీస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కూడా ఆ పార్టీతో ఎన్నికల సంబంధాన్ని పెట్టుకోవద్దని కోరింది.
హైద్రాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు వెళ్ళిపోవలసివుంటుందని కెసిఆర్, వి హనుమంతరావులు చేసిన ప్రకటనలు సీమాంధ్రులను ఇంకా ఆవేశపూరితులను చేసాయి. తాజాగా హైద్రాబాద్ విషయంలో, ఉమ్మడి రాజధానిగా ఉన్నా, శాంతి భద్రతలు మాత్రం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని అనటంతో ఇరుప్రాంతాల మధ్యా మరోసారి చిచ్చు రేగుతోంది.
హైద్రాబాద్ విషయంలో ప్రకటించిన విషయాలనుంచి కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గకుండా ఉండటం కోసం తెరాస తెలంగాణా ప్రాంతంలో బస్సు యాత్రలు, రాజకీయ శిక్షణలతో చురుగ్గా ఉద్యమ కార్యకలాపాలను మరోసారి చేపట్టబోతోంది.
మొత్తానికి రాష్ట్రంలో ఆందోళనలకు హైద్రాబాద్ నగరమే కీలకమైన విషయంగా మారింది. 1589లో కులీ కుతుబ్ షా చేత భాగ్ నగరంగా ఏర్పడ్డ భాగ్యనగరం ప్రస్తుతం తన భాగ్యంలో ఏం రాసుందా అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more