ఎమ్మల్సీ, మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఈ రోజు హైద్రాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విడిపోయి కూడా మనం ఒకే జాతిగా కలిసివుండచ్చని అన్నారు. విడిపోకుండా కలిసివుండచ్చన్న సీమాంధ్ర ప్రజల సమైక్య ఉద్యమం దృష్ట్యా, దాని వలన ఇరు ప్రాంతాలలో రాగద్వేషాలు పెరుగుతున్నాయని, అది తనకు చాలా ఆందోళన కలిగిస్తున్నదని ఆన్నారాయన. కమిటీలు, చర్చల వలన ఇక ప్రయోజనమేమీ లేదని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని సిడబ్ల్యుసి నిర్ణయాన్ని డిఎస్ బలపరచారు.
విభజన నిర్ణయానికి ముందుగానే అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళి వచ్చిన డిఎస్ తనకిచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చటానికి చాలా రోజుల తర్వాత నిజామాబాద్ వెళ్ళి వచ్చారు. ముఖ్యమంత్రి సమైక్యానికి మద్దతుగా మాట్లాడుతున్నారని అక్కడ తన ప్రసంగంలో ఆయనని తప్పుపట్టారు డిఎస్. పిసిసి అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన డిఎస్ మీద అధిష్టానం గురుతర బాధ్యతనేదో పెట్టబట్టే ఇన్నిరోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు రావటం, మాట్లాడటం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో అందరూ అనుకుంటున్నారు. బహుశా రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా రాష్ట్రానికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడతానన్నారేమో అని కొందరు చెవులు కొరుక్కుంటుంటే, ఎక్కువగా మీడియాతో మాట్లాడటానికి ఉత్సాహం చూపించని డిఎస్, నేనేం చెప్పినా దానికి మీ ఇష్టమొచ్చింది జోడించుకుంటారు కాబట్టి నేనేమీ చెప్పను అని స్పష్టంగా చెప్పే డిఎస్, ఇప్పడు మీడియా ముందు విభజన గురించి మాట్లాడటం వాళ్ళ మాటలను బలపరుస్తోంది.
తెలుగు జాతి ఒకటే అయినప్పుడు ప్రాంతాలవారీగా విడిపోయినా కలిసున్నా ఎలాగూ జాతి ఒకటే. ఇక ఒకే జాతిగా ఉందామన్న పిలుపేమిటని రాజకీయ వర్గాల్లో కొందరు ప్రశ్నిస్తుంటే, రాగ ద్వేషాలలో ద్వేషం వద్దులే కానీ, రాగం మంచిదేగా అది అనురాగానికి దారితీస్తుంది కదా అని డిఎస్ ఉపయోగించిన పదాన్ని తప్పుపట్టారు మరికొందరు. కమిటీల వలన ప్రయోజనం లేదనుకున్నప్పుడు ఇప్పడు మరో ఆంటోనీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసినట్టో అని కూడా వ్యాఖ్యానాలు వచ్చాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more