భారతీయ జనతా పార్టీ పగ్గాలు కొత్తతరానికేనన్న సూచనలను బాహాటంగా చేస్తోంది ఆ పార్టీ.
ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసిన బ్యానర్లలో అద్వానీ ఫొటో మాయమై ఆ స్థానంలో 2014 ఎన్నికలకోసం నరేంద్ర మోదీ ఫోటొ ప్రత్యక్షమైంది. సీనియర్ నేతలు లాల్ కిషన్ అద్వాణీ, అటల్ బిహారీ వాజ్ పేయ్ ల జమానా తీరిపోయిందన్న సంకేతాన్ని సందేహాలకు తావులేకుండా మరీ తెలియజేస్తూ ఎన్నికల ప్రచారాల బ్యానర్ లను తయారు చేయించింది పార్టీ వ్యవస్థ మోదీ ఆమోదంతో.
అంతే కాదు దాని మీద రాతలు కూడా అదే నినాదాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు నయీ సోచ్ నయీ ఉమ్మీద్ (కొత్త ఆలోచనా ధార, కొత్త ఆశలు) అనే నినాదంతో ప్రజల ముందుకు వస్తున్న భాజపా అంతకు ముందున్న సుశాసన్ సంకల్ప్ భాజపా హీ వికల్ప్ (సరైన పాలనకు భాజపాయే మార్గాంతరం) అనే నినాదాన్ని తుడిచివేసింది.
ఇంకా, ఏమో పాత నాయకులకు పార్టీలో ప్రాబల్యముందేమో అనే అనుమానాలు ఎవరికైనా ఉంటే అవి కొట్టుకుపోయేట్టుగా, ఈ మార్పులను చేసింది భాజపా. ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నా, వాటికోసం అన్నివిధాలుగా తయారీలు చేయటం ప్రారంభించిన భాజపా ముందుగా పాత ముఖాలను తొలగించి కొత్త నాయకుని ఫొటోను ప్రచురించింది.
భాజపా ప్రచార సభలు ఆగస్ట్ 11 న హైద్రాబాద్ లో జరుగనున్న బహిరంగ సభతో ప్రారంభమవటం విశేషం. సెప్టెంబర్లో సాధారణ ఎన్నికల ప్రకటన వెలివడవచ్చని అంచనా వేస్తున్న భాజపా ఈ లోపులోనే ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ లోపులో మోదీకి ఆకర్షణ ఉన్న రాష్ట్రాలలో బలాలను సమీకరిద్దామనే ఉద్దేశ్యంతో పాటు పార్టీ కార్యకలాపాలకన్నిటికీ ఆమోద ముద్ర అవసరమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి అందుకు ఆమోదం కూడా వెలివడవలసిన అవసరం ఉంది.
భాజపా, సంఘ్ ల అంచనా ప్రకారం సెప్టెంబర్ నుంచి ప్రారంభించినా, ఎన్నికల సమయానికి సంసిద్ధమవటానికి, దేశంలో సద్భావనను పెంచుకోవటానికి మోదీకి ఆరు నెలల సమయం చిక్కుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more