నాలుగున్నర కోట్ల ఆశాకిరణం ఇప్పుడు ప్రజల ముందు కేసిఆర్ నవ్వులపాలైయ్యడు. తెలంగాణ ముద్దు బిడ్డగా పేరు తెచ్చుకున్న కేసిఆర్. ఇప్పుడు కేసిఆర్ పై విమర్శలు, చీదరింపులు, చిల్లరపనుల మరకలు పడుతున్నాయి. నిన్నటి వరకు జాతీయ స్థాయిలో మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేసిఆర్ ఇప్పుడు చీప్ ఆలోచనలతో అందరికి చులకనవుతున్నారని తెలంగాణ రాజకీయ మేథావులు అంటున్నారు. నిన్న కేసిఆర్ కుడి భుజం, ఎడమ భుజం అయిన వాళ్లు మీడియా ముందు ఒక బాంబు పేల్చారు. కొంత మంది వ్యక్తులు కేసిఆర్ ను చంపేందుకు హత్య కుట్ర చేస్తున్నారని, అందుకు కోట్ల రూపాయలు సుఫారీ తీసుకున్నారని మీడియా ముందు టీఆర్ఎస్ పౌరుషం చూపించారు. కానీ ఇక్కడే వాళ్లు పెద్ద తప్పు చేశారని ప్రతి ఒక్కరి అర్థం అవుతుంది. కేసిఆర్ కు నిజంగా ప్రాణాహనీ ఉంటే.. వీరు మీడియాలో గోల చెయ్యటమే అందరికి ఆశ్చర్యం కలిగించిందని సామన్య ప్రజలు అంటున్నారు.
అంతేకాకుండా తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి మరోసారి తప్పు చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుడికి ప్రాణహానీ ఉన్నది అంటే.. అనేక కోణాల్లో దానిపై చర్చలు జరుగుతాయి. ముందుగా ఇంటిల్ జన్స్ వారికి అందుతుంది. ఏ రాజకీయ నాయకుడికి, ఎటు వైపు నుండి ప్రాణా హానీ ఉందో వారికి ఇట్టే తెలిసిపోతుంది. 12 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ కారుడిగా, సీనియర్ రాజకీయ నాయకుడి చర్రిత కలిగిన కేసిఆర్ పై హత్య చేసేందుకు ఎవరు సాహిస్తారు? కేసిఆర్ ను ఎందుకు చంపుతారు? కేసిఆర్ ను చంపితే వచ్చే లాభం ఏమిటి? ఆయనకు ఉన్న శత్రువు వర్గం ఎవరు? అనే ప్రశ్నలు ప్రతిసామాన్య ప్రజలకు కలుగుతున్నాయి. కేసిఆర్ ఏమైన ప్యాక్షనిస్టు? కేసిఆర్ కు మావోయిస్టులకు ఏమైన వైర్యం ఉందా? అంటే ఏమీ లేదని తెలంగాణ ప్రజలు పెదవిరుస్తున్నారు. అలాంటప్పుడు కేసిఆర్ ను చంపవలసిన అవసరం ఏమిటి? ఎవరికి ఉంది? దేని కోసం? అంటే ఇది కేవలం.. కేసిఆర్ అండ్ కో ఆడుతున్న డ్రామా అని అందరికి తెలిసిపోయింది. ఈ డ్రామా వల్ల వారికి ఫలితం ఏమిటి? అంటే.. కేవలం ఇమేజ్ కోసమే కేసిఆర్ హత్యకు కుట్ర, కోట్ల రూపాయలు సుఫారీ అని నాటకం ఆడినట్లుగా ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు. జరుగుతున్న పరిస్థితుల ద్రుష్ట్యా గులాబీ దళాలు ఈ నాటకం ఆడవలసి వచ్చిందని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి.
దీనికి సంబంధించిన కొన్ని ఉదహరణాలే మన కళ్లముందు ఉన్నాయని అంటున్నారు. తాజగా రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు ఇందుకు కారణమాని అంటున్నారు రాజకీయ నాయకులు. నిన్నటి వరకు తెలంగాణలో హీరో ఉన్న కేసిఆర్ సడన్ గా జీరోగా మారిపోయిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు పులి మీద స్వారీ చేసిన కేసిఆర్ కు , ఆ పులే కేసిఆర్ ను వేటాతుందనే విషయం తెలుసుకోలేకపోయాడు. ఇపుడు పులి పంజా కు చిక్కిన పిల్లి కూనల గిలగిల కొట్టుకుంటున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ తెలంగాణ నాయకులను తన పార్టీలో చేర్చుకొని తెలంగాణ మగధీరుడుగా విర్రవిగిపోయిన కేసిఆర్ చెంపపై ‘హస్తం ’ దెబ్బ (ముద్ర) పడింది. దీంతో కేసిఆర్ పక్కన చేరిన కాంగ్రెస్ నాయకులు, కెకె, వివేక్, మందా జగన్నాదం లాంటి వారికి ఫీజులు ఒక్కసారిగా రాలిపోయి, కరెంట్ షాక్ కొట్టిన కాకులు మాదిరి నెల మీద పడ్డారు. అన్నం పెట్టి తన కలిపేసున్న గులాబీ బాస్ పై వీరు తిరుగుబాటుకు సిద్దమైనట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణకు మేము వీరబిడ్డలం అని వెళ్లిన వారిని కాంగ్రెస్ పార్టీ మట్టికరిపించిందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
ఇప్పటికే గులాబీ కోట నుండి కొన్ని గులాబీలు జాతీయ ‘హస్తం ’ దగ్గరకు చేరటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. 12 సంవత్సరాల నుండి ప్రత్యేక తెలంగాణ కోసం వీర తపస్సు చేసిన కేసిఆర్ కు ఫలితం శూన్యమైదనే విషయం పూర్తి అర్థమైంది. తెలంగాణ తెచ్చిన క్రెడిట్ అంత హస్తం పార్టీ వాళ్లు లాగేసుకున్నారు. తెలంగాణ క్రెడిట్ అంత కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన తరుణంలో.. కేసిఆర్ మరళ తన ఇమేజ్ ను తెచ్చుకోవటానికి సుఫారీ కుట్ర ను తెరపైకి తెచ్చినట్లు రాజకీయ పార్టీలు, రాజకీయ మేథావులు, మీడియా వర్గాలు అంటున్నాయి. కేసిఆర్ పై హత్యకు కుట్ర అని మీడియాలో ప్రకటన రాగానే వెంటనే తెలుగుదేశంపార్టీ నాయకులు కామెంట్ చేశారు. కెసిఆర్ను హత్య చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కేవలం కేసిఆర్ తన ఇమేజ్ ను తెచ్చుకోవటానికే గులాబీ గ్యాంగ్ ఆడుతున్న నాటకమని టీడీపీ నాయకులు అంటున్నారు. ఏమైన తన ఇమేజ్ కోసం కేసిఆర్ ఇలా దిగజారుడు పనులు చెయ్యటం మంచిది కాదని తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేథావులు హితువు పలుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more