పర్యాటక స్థలాలను పరిశుభ్రంగా ఉంచటమనేది ప్రథమ కర్తవ్యం. పురాతనమైన కట్టడాలకు వాటి చరిత్రే శోభనిస్తుంది కాబట్టి, వాటిని పాతవాటిగా కనపడనిచ్చినా పరవాలేదు కానీ పారిశుభ్రత మాత్రం చాలా అవసరం. ఎక్కడెక్కడినుంచే వచ్చే పర్యాటకులకు కనీస వసతి, పరిశుభ్రమైన పర్యాటక స్థలం ఉంటే చాలు. వీటితో పాటు భద్రత విషయంలో కూడా కట్టుదిట్టాలతో పాటుగా పర్యాటకులకు భరోసా ఇచ్చే విధంగా వాళ్ళు అవసరంలో ఉపయోగించుకునేందుకు హెల్ప్ లైన్ సౌకర్యం కూడా ఉండాలి.
ఈ విషయాల మీద దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ఓఎన్ జిసి తో కలిసి ఈ రోజు ఆగ్రాలో తాజ్ మహల్ తో ప్రారంభించి క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని కొనసాగించదలచుకుంది. ఇది ఈరోజు పర్యాటక శాఖా మంత్రి కె.చిరంజీవి చేతుల మీదుగా జరుగబోతోంది. దీని తర్వాత ఓఎన్ జి సి తో ఇతర పర్యాటక ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా చెయ్యటానికి ప్రభుత్వం ఒడంబడిక చేసుకుంది. హైద్రాబాద్ లోని గోల్కొండ, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు. ఢిల్లీ ఎర్రకోట కూడా పారిశుద్ధ్యానికి నోచుకోబోతున్నాయి.
పర్యాటక రంగాలను ఒకసారి శుభ్రం చేస్తే చాలదు. వాటి పారిశుభ్రతను నిరంతరం నిర్వహించాలి. దానితో పాటుగా ప్రతి పర్యాటక స్థలంలోనూ పర్యాటకులు బసచేయటానికి తగు ఏర్పాట్లు, వారికి ఆపత్కాల సేవలు (హెల్ప్ డెస్క్ లు) కూడా ఓఎన్ జిసి నిర్వహిస్తుంది.
ఈ ఏర్పాట్ల ద్వారా 60 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించేవిధంగా ప్రణాళిక వెయ్యాలని తద్వారా పర్యాటకరంగ ఆదాయాన్ని 12 వ పంచవర్ష ప్రణాళికలో 12 శాతం పెంచాలని ప్రభుత్వం చేసిన ఆలోచన.
పోయిన సంవత్సరం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లోని కుతుబ్ మినార్ లో క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని ఐటిడిసి భాగస్వామ్యంతో చేసింది.
మొత్తానికి పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతూ దేశానికి పేరు ప్రతిష్టలతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకునే దిశగా అడుగులు వేయటం ముదావహం. ప్రణాళికలు, అందుకు అవసరమైన నిధులు ఎప్పుడూ ఉంటాయి కానీ వాటిని ముందుకు కదిలించే నాధుడు లేకనే అవి కాగితాల వరకు పరిమితమై ఉంటాయి. చిరంజీవి కేంద్ర పర్యాటక రంగ మంత్రిత్వ బాధ్యతలు తీసుకున్నదగ్గర్నుంచి పర్యటక రంగం కొత్త రంగులు పులుముకోవటానికి సన్నద్ధమవటం స్పష్టంగా కనపడుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more