వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు , కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు చల్లని కబురులు అందాయి. కష్టాల్లో ఉన్న వైఎస్ జగన్ కు అందిన స్వీట్ కబురులతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ప్రజల వద్దకు జగనన్నా వదిలిన బాణం ఈ రోజు రికార్డు స్రుష్టించింది. ప్రపంచ చరిత్రలో మరే మహిళ సాహసించని విధంగా ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో 3,000 పై చిలుకు కిలోమీటర్లు సుదీర్ఘీ పాదయాత్రలో నడక మొదలు పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 'ప్రజాప్రస్థానం'ను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లోనే ఈ ఈ చారిత్రక పాదయాత్రకు ఉపక్రమించారు. ఒక మహిళ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఒక రికార్డు. అయితే షర్మిల రికార్డుల కోసం పాదయాత్ర చేయడంలేదు. కేవలం ప్రజల బాగోగులను తన తండ్రి చూపిన మార్గలో సమీపం నుంచి చూడడం, వారి కష్టాలు కడగండ్లను నేరుగా వారి నుంచే విని, వారి భరోసా ఇచ్చేందుకు ఆమె ఈ పాదయాత్ర మహా యజ్ఞాన్ని చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఇంటి బిడ్డగా ఇప్పుడామె మారిపోయారు.
2012 అక్టోబర్ 18న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద పాదయాత్ర ప్రారంభించిన శ్రీమతి షర్మిల 2013 జూలై 16 నాటి షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి మొత్తం 2,819.2 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేస్తున్నారు. కాగా, చంద్రబాబు నాయుడు పాదయాత్ర బ్రేక్ అయిన 2,817 కిలోమీటర్ల దూరాన్ని షర్మిల నేడు అధిగమిస్తున్నారు. ఈ అరుదైన సంఘటనకు విజయనగరం జిల్లా వేదికగా మారింది. చంద్రబాబు 208 రోజుల్లో ఈ దూరం నడిస్తే.. శ్రీమతి షర్మిల 211 రోజుల్లో పూర్తిచేస్తున్నారు. చంద్రబాబు 16 జిల్లాల్లో నడిచిన దూరాన్ని షర్మిల 13వ జిల్లాలోనే అధిగమిస్తున్నారు. నేటికి షర్మిల మొత్తం 184 మండలాల్లో 1,784 గ్రామాల్లో నడిచారు. ఈ రికార్డు విషయం గురించి జైల్లో జగనన్నాతెలియటంతో .. ఎంతో ఆనందపడినట్లు తెలుస్తోంది. అయితో రెండో విషయం ఏమిటంటే.. కొన్ని పత్రికలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీల్లో వెనకబడిపోయిందని చెబుతున్నాయి. అయితే అసలు ప్రజల మద్య జరుగుతున్న విషయాన్ని ఎవరు దాచలేరు అనే విషయం ఆ పత్రికలు మరిచిపోయినట్లుగా ఉందని. కొత్తగా పెట్టిన పార్టీ కాబట్టి, గ్రామ స్థాయిలో ఏముంటుందని దిగిన ప్రధాన రాజకీయ పార్టీలకు .. వైసీపీ దెబ్బ ఏమిటో రుచిచూశారు.
ప్రతి గ్రామంలో వార్డు స్థాయి నుంచి వైసీపీ పార్టీ బలంతో పుంజుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన పార్టీలకు వైసీపీ పార్టీ కంట్లో నలుసు మాదిరిగా తయారైంది. వైసీపీ దెబ్బకు ..కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ పరిణమాలు వైసీపీ పార్టీకి మేలు చేసే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీఎన్నికలు వైసీపీ పార్టీ మనుగడును పెంచుతున్నాయాని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకి టెస్ట్ పరీక్షగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉపయోగపడుతున్నాయి. పుష్కరకాలం నుండి ఉన్న టీఆర్ ఎస్ పార్టీ కూడా ఎప్పుడు గ్రామ పంచాయితీ ఎన్నికలకు పోటీ చెయ్యలేదు. అంతేకాకుండా జాతీయ పార్టీ అయిన బిజేపి కూడా ఇలాంటి సాహసం చెయ్యలేదు, ఇక ఎర్రజెండ నాయకులు కూడా ఇలాంటి దైర్యం చెయ్యలేదు. చరిత్రలో మొట్టమొదటి సారిగా.. పార్టీ పెట్టి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న వెంటనే.. గ్రామ స్థాయి బరిలోకి నిలబడి, ప్రధాన రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది వైసీపీ. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ జైల్లో చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల నాటికి జగన్ కు బెయిల్ వస్తే మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలకు.. జింతాత..జిత జితా అవుతుందని వైసీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. కానీ 2014 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ మార్పులు జరుగుతాయో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more