సత్తిబాబు స్వయంగా కొనితెచ్చుకున్న కష్టాలతో సతమతమవుతున్నాడు.. కొత్తగా వచ్చే కష్టాలను చూసి సత్తిబాబు భయపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కు పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. గతంలో సత్తిబాబు ఆ తప్పు తెలిసి చేశాడో, తెలియక చేశాడో తెలియాదుగానీ , అది ఇప్పుడు సత్తిబాబు పాలిట పెను సమస్యగా మారింది. ఈనెల 30న ‘తెలంగాణ సాధన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున్న ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలపెట్టిన సభకు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి లభించిన తరువాతేనే నగరంలో తెలంగాణ సాధన సభకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
తెలంగాణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం కూడా ఉన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ సభ, పంచాయితీ శాఖ మంత్రి జానా రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, డి.శ్రీనివాస్ ఆద్వర్యంలో తెలంగాణ సాధన సభను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సభకు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు, తెలంగాణను కోరుకునే నాయకులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ కావాలి అన్న ప్రతి ఒక్కరు ‘తెలంగాణ సభకు ఆహ్వానీతులే అని బుల్లితెర మీద ప్రకటన్లు హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణ సాధన సభ సత్తిబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.
గతంలో కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో జై ఆంద్ర సభ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సభకు బొత్స సత్యనారాయణ ముఖ్య అతిధిగా వెళ్లి, వారి చెప్పిన మాటలను వినివచ్చాడు. కానీ సత్తిబాబు జై ఆంద్ర సభలో ఉపన్యాసం మాత్రం చెప్పలేదు. కాంగ్రెస్ పీసీసీగా ఉండి జై ఆంద్ర సభకు ఎలా వెళ్లారని సత్తిబాబును .. గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హుస్సెన్ సాగర్ వాటర్ తో కడిగిపాడేసారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సెగ దెబ్బకు సత్తిబాబు వారికి సర్థిచెప్పుకోలేక, అటూ ఇటూ నలిగిపోయిన నల్లని మచ్చతో కాలం గడుపుతున్నారు. ఇప్పటికి ఆ మచ్చ అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ నల్లని మచ్చ కంటే.. కొత్తగా తెలంగాణ సాధన సభతో కోసే గాయానికి సత్తాబాబు భయపడుతున్నారు.
రేపు జరగబోయే తెలంగాణ సాధన సభకు సత్తిబాబును తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించారు. ఒకేవేళ వారు పిలిచిన, పిలవకపోయిన, కాంగ్రెస్ పార్టీ తరుపున జరుగుతున్న సభ కాబట్టి, సత్తిబాబు తప్పనిసరిగా వెళ్లాలి. సత్తిబాబు తెలంగాణ సాధన సభకు వెళ్లితే మాత్రం వెంటనే సమైక్య సెగ సత్తిబాబుకు అంటుకుంటుంది. ఇప్పుడు సత్తిబాబు పరిస్థితి ‘‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం ’’ ఇలాగే ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. తెలంగాణ సాధన సభ సమస్య నుండి సత్తిబాబు రేపు ఏలా విడుదలవుతాడో చూద్దాం...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more