ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులే. అయితే ఒకరు తెలంగాణవాది, మరొకరు సమైక్య వాది. అయిన కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు సోనియాగాంధీ వాదులుగా మారిపోయారు. సోనియా గాంధీ ఎలా అంటే అలా నడుచుకుంటున్నారు. రీసెంట్ గా కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్న కావూరి సాంబశివరావు, సీనియర్ కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి ఇద్దరి ఆశయాలు వేరు, ఆలోచనలు వేరు అయిన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో ఉండి ఉద్యమాలకు ఊపిరిపోచే నాయకులుగా ఉండాల్సిన వారు, ఇప్పుడు ఉద్యమాలను తొక్కేస్తున్నారు. జైపాల్ రెడ్డి వలన తెలంగాణ ఉద్యమానికి ఏలాంటి ఉపయోగం లేదని తెలంగాణ నాయకులు తెలుసు. జైపాల్ రెడ్డి కంటే కేంద్రమంత్రి బలరాం నాయక్, సర్వేసత్యనారాయణ తెలంగాణ ఉద్యమం పై పోరాటం చేస్తున్నారు. జైపాల్ రెడ్డి తెలంగాణ వాది కాదు.. సోనియా వాదిగా మారిపోయాడు. నిన్నటిదక సమైక్యాంద్ర అంటూ ప్రజలకు, విద్యార్థులకు సమైక్య పాఠాలు చెప్పిన కావూరి, నేటితో సోనియా వాది మారిపోయి మాటమార్చారు, తెలంగాణలో జైపాల్ రెడ్డి ఉద్యమాన్ని వదిలేస్తే, సీమాంధ్రాలో కావూరి సాంబశివరావు సమైక్యాంద్ర ఉద్యమాన్ని తుంగల్లోతొక్కిపారేసాడు. కేంద్ర మంత్రి పదవి రాగానే .. కావూరి జాతియవాదిగా మాట్లాడుతున్నాడు.
సమైక్య ఉద్యమంలో పాల్గొంటారా? అని ఒక విలేకర్ ప్రశ్నిస్తే .. పాల్గొనని ఖచ్చితంగా తేల్చేసి చెప్పాడు. అంతేకాకుండా వెంటనే సర్పంచ్ లా వీధిలో నిలబడి ఉద్యమాలు చేయలా..? అని ఆ విలేకర్నే కావూరి ప్రశ్నించారు. కావూరి వేసిన ప్రశ్నకు మీడియా ప్రతినిథులకే మైండ్ బ్లాంక్ అయ్యింది. ఈ న్యూస్ విన్న సమైక్యవాదుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..? ‘‘ సత్యం కోసం సర్వం పొగొట్టుకున్న సత్యహరిశ్చందుడు ఉన్నడనే విషయం తెలుసు’’ కానీ పదవి కోసం మాటమార్చే రాజకీయ నాయకులు కూడా ఉన్నారనే విషయం కావూరి చూస్తే రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. సమైక్యవాదిగా ముద్రపడిన కావూరి ఇప్పుడు సోనియావాది మారిపోవటం పై సీమాంద్ర వాదులు మండిపడుతున్నారు. జైపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తే.. కావూరి సమైక్యాంద్ర ఉద్యామన్ని తొక్కివేస్తారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నా. బీ కేర్ పుల్ .. మాటమార్చే నాయకులు ఉన్నారు?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more