ఎన్నో డెడ్ లైన్లు, రాజకీయ మేథావులే డెడ్ లైన్లు విధించి, అలసి, సొలసి పోయి ఫామ్ హౌస్ లో కూరగాయలు పండించుకుంటున్నారు. డెడ్ లైన్లకే దడిచే రకం అయితే 100 సంవత్సరాల చర్రిత ఎలా ఉంటుంది. ఉడత ఊపులకు చింతకాయలు రాలవని ఆ ముగ్గురు ఎంపీలకు తెలిసిపోయింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన గులాబీ బాస్ అనుభవం మీద సలహా కూడా ఇచ్చారు. డెడ్ లైన్లతో తెలంగాణ రాదని, అయిన ఈ ముగ్గురు ఎంపీలు కలిసి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పై తొడకొట్టారు. చివరకు గడువు దాటిపోతుంది. గడపదాటలా వద్దా? అనే సందిగ్దంలో పడ్డారు ఈ దళిత ఎంపీలు.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈనెల 30లోపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేయకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టంచేశారు. దీంతో వారు పెట్టిన గడువు ఈరోజు ముగియనుంది. పెద్దపల్లి ఎంపీ వివేక్ పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన తన అనుయాయులు పార్టీ ముఖ్యనాయ కులతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
నాగర్కర్నూలు ఎంపి మందా జగన్నాథం, వరంగల్ ఎంపి రాజయ్యలు కూడా తమ ముఖ్య అనుచరులతో ముమ్మర మంతనాలు సాగిస్తున్నారు. జి.వివేక్ మాట్లాడుతూ, తాము అధిష్ఠానానికి పెట్టిన డెడ్లైన్ ముగుస్తుండడంతో కార్యకర్తలతో సమావేశమయ్యానని వెల్లడించారు. తెలంగాణకు కాంగ్రెస్ అధిష్ఠానం అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్ నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కార్యకర్తలు తనకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇంతకాలం స్పందించని అధిష్ఠానం ఈ రెండు రోజుల్లో స్పందిస్తుందని అనుకోవడం లేదని, త్వరలోనే పార్టీ మారే విషయంపై స్పష్టత ఇస్తానని ప్రకటించారు.
కాంగ్రెస్లో దళితులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుండి తమకు ఎటువంటి పిలుపు రాలేదని వివేక్ వెల్లడించారు. మందా జగన్నాథం, వివేక్లు కూడా ముఖ్య నాయకులను పిలిపించుకుని ఈ అంశంపై చర్చిస్తున్నారు. జూన్ 3వ తేదీన ఈ ముగ్గురు ఎంపీలు తెరాసలో చేరుతారనే వాదనలు వినిపించాయి. అయితే అధిష్ఠానం పెట్టిన గడువు 30న ముగుస్తుండడంతో జూన్ 1న తెరాసలో చేరాలని వివేక్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే మిగిలిన ఇద్దరు ఎంపిలు కూడా ఆయనతోపాటు తెరాస తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరికి నాయకత్వం వహిస్తున్న కె.కేశవరావు నిర్ణయంపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ముగ్గురినే కేకే కూడా అనుసరిస్తాడనే ప్రచారం కొనసాగుతోంది. అయితే ఆయన మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ముగ్గురు ఎంపిలు మాత్రం రేపో మాపో కారెక్కెందుకు మాత్రం సిద్ధమవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more