గులాబీ పార్టీలో కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వివేక్ను కేటీఆర్ కోటాలో పార్టీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివేక్ పారిశ్రామిక వేత్త కావడం, సొంతంగా ఒక టీవీ చానెల్ నడపడంతోపాటు పార్టీకి అవసరమైన నిధులను కూడా సమకూర్చగలరన్న ధీమాతోనే ఆయనకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను టీఆర్ఎస్ నుంచి ఇప్పించడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తనకు, తన సోదరిడికి పార్టీ టీకెట్లు ఖరారు చేసుకునేందుకు పెద్ద ఎత్తున నిధులను ఇచ్చేందుకు పెద్ద పల్లి ఎంపీ వివేక్ ఇప్పటికే కేటీఆర్కు హామీ ఇచ్చినట్లు సమాచారం. నాగార్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం, కేసీఆర్ కుమార్తే కవిత కోటాలో పార్టీ టికెట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మేరకు ఆమెతో ఇప్పటికే స్పష్టమైన హామీ పొందారని టీఆర్ఎస్లోని ఒక వర్గం చెప్పింది. రఘునందన్ ఆరోపణలను ఒక్కసారి పరిశీలిస్తే టీఆర్ఎస్లో డబ్బు పరిమితి ఎంతగా పెరిగిపోయిందో ఇట్టే అర్థమవుతుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా ఇతర ఎంపీలను, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి రప్పించే వ్యవహారంలో కూడా కేసీఆర్ కుటుంబం రెండుగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కే. కేశవరావు రాకను కేసీఆర్ కుమార్తె కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలుస్తోంది. కేసీఆర్కు ఖచ్చితంగా ఏదో ఒక పార్లమెంటు స్థానాన్ని కేటాయించడం ఇష్టం లేని ఆమె.. తండ్రితో తీవ్రంగా వాదించినట్లు తెలిసింది. ఎలాంటి హోదాలేని కేకేను పార్టీలోకి రప్పించడం వల్ల ఎవరికి ఉపయోగం లేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కేకే పాత్ర కరివేపాకు సామెతేక పరిమితమయిందని. ఎలాంటి ప్రజా బలం లేని ఆయన పార్టీలోకి రావడం భారమే తప్ప ఉపయోగం లేదని ఆమె తండ్రితో వాదించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కుటుంబంపై ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన ఎంతో మంది నేతలు చేసిన ఆరోపణలపై ఆ పార్టీ నాయకత్వం వివరణ ఇవ్వకపోగా ఎదురు దాడికి దిగుతోంది. ఒకపడు కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వొదులుకొని టీఆర్ఎస్లో చేరిన కపిలవాయి దిలిప్కుమార్కు కేసీఆర్ కేంద్ర మంత్రి హోదాలో జరిపిన అనేక లావాదేవీలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన పార్టీని వొదిలి బయటికి వచ్చి కేసీఆర్పై చేసిన ఆరోపణల న్నింటిని టీఆర్ఎస్లోని కేసీఆర్ వర్గం అప్పట్లో ఖండించలేకపోయారు.
కారణం అప్పటి వరకు వారంతా దిలిప్కుమార్తో ఎన్నో పనులు చేయించుకున్నవారే కావడంతో కేసీఆర్పై ఆయన చేసిన ఆరోపణలను గట్టింగా ఖండించలేకపో యారు. ప్రస్తుతం రఘునందన్ చేసిన ఆరోపణలను కూడా ఆ పార్టీ నాయకులు చాలా ఆలస్యంగా ఖండించినా లోపల మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసల ప్రస్తానం జరుగుతోంది. ఇది కూడా ప్రస్తుతానికి ఆ పార్టీ నాయకులకు సంబరపరుస్తున్నా... భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
పార్టీ ఆవిర్భావం నుంచి అనేక మంది నాయకులు ఆయా నియోజకవర్గాల్లో పని చేసుకుంటూ.. పార్టీ ప్రతిష్టతోపాటు వ్యక్తిగత పలుకుబడిని కూడా పెంచుకుంటూ వచ్చారు. దశాబ్దకాలంగా జరిగిన ఎన్నో ఉద్యమాలకు ముందుండి నడిపించి ఆయా నియోజకవర్గాల పరిధిలో వారి ప్రభాల్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్నారు. సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది. నిన్నటి దాకా తమను దుమ్మెత్తిపోసిన తమ ప్రత్యర్థి పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు రావడం వారిని పార్టీ ఆగ్రనాయత్వం ప్రోత్సహించడంతో అప్పటి వరకు ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెంచుకున్న ఆశావాహులు మొత్తం పార్టీకి వ్యతిరేఖమవుతున్నారు.
ఇతర పార్టీ నాయకులు కూడా తెలంగాణ సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకొని ఎలా అయినా చట్ట సభలకు రావాలని టీఆర్ఎస్వైపే మొగ్గుచూపుతున్నారు. ఆ క్రమంలో టీఆర్ఎస్ కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు కేటీఆర్ను, మరికొందరు కవితను, ఇంకోందరు హరీష్రావును ఆఖరిగా కేసీఆర్ను కలుస్తున్నారు. దీంతో కేసీఆర్ కుటుంబంలోనే నాలుగు పవర్ సెంటర్లుగా తయారైందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more