నీలం సంజీవరెడ్డి శతజయంతి సందర్భంగా ఈరోజు హైద్రాబాద్ రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన శతజయంతి ఉత్సవాలు నవంబర్ 1 వరకు కొనసాగనున్నాయి.
ఆరవ భారత రాష్ట్రపతిగా 1977 నుంచి 1982 వరకు సేవలందించిన నీలం సంజీవరెడ్డి జననం మే 19 1913న అనంతపురం జిల్లా ఈలూరు గ్రామంలో జరిగింది. సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవీ కాలంలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరా గాంధీ ముగ్గురు ప్రధాన మంత్రులు ప్రభుత్వాన్ని నడిపారు.
విద్యార్థి దశలోనే సత్యాగ్రహంలో పాల్గొని స్వాతంత్ర సమరాన్ని నడిపించిన సంజీవరెడ్డి రాజకీయ ప్రస్తానం చాలా సుదీర్ఘకాలం విభిన్న హోదాలలలో జరిగింది. 1936లో ఆంధ్రప్రదేశ్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ సచివులుగా ఎన్నుకోబడి 10 సంవత్సరాలు నిరాటంకంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. తర్వాత మద్రాస్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సెక్రటరీగా పనిచేసారు. భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో సభ్యునిగా పనిచేసారు.
సంజీవరెడ్డి 1949 నుంచి 1951 వరకు మద్రాస్ రాష్ట్ర మంత్రిగా పనిచేసారు. 1951 లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసిన సమయంలో సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగానూ, తెలంగాణా జిల్లాలు కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగానూ సేవలందించారు. రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికైన సంజీవరెడ్డి లాల్ బహాదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేసారు.
1967లో లోక్ సభ సభాపతిగా పని చేసిన సంజీవరెడ్డి భారత నాల్గవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణానంతరం కాంగ్రెస్ తరఫున రాష్ట్రపతి పదవికి నామినేట్ అయ్యారు. కానీ స్వల్ప ఆధిక్యతతో స్వతంత్ర అభ్యర్థి వివి గిరి ఐదవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆరవ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన రుక్మణీ దేవి అరందేల్ అనే నాట్యంలో ప్రవీణురాలు రాష్ట్రపతి పదవినలంకరించాలని కోరుకున్నా, సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు.
రాష్ట్రపతి పదవీకాలం తర్వాత స్వగ్రామం చేరుకున్న నీలం సంజీవరెడ్డి తన 83 వ యేట 1966 లో మృతిచెందారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సంజీవరెడ్డికి గౌరవ డాక్టరేట్ ని ప్రసాదించి గౌరవించింది.
సుదీర్ఘకాలం రాజకీయాలలో వివిధ భూమికలను నిర్వహించిన సంజీవరెడ్డి ఈ రోజు శతజయంతి సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఈ రోజు నుంచి నవంబర్ 1 వరకు వేడుకలను చేయదలచుకోవటం ముదావహం. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యబోతున్న రెవిన్యూ అకాడమీకి సంజీవరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించటం జరిగింది. సచివాలయం ప్రాంతంలోని సంజీవరెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రోజు సంజీవరెడ్డి ఫొటోతో కూడిన పోస్టల్ కవర్ ను కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఆవిష్కరించారు.
రవీంద్రభారతిలో ప్రారంభమైన సంజీవరెడ్డి శతజయంతి వేడుకలకు హాజరైన గవర్నర్ ఇసియల్ నరసింహన్ సంజీవరెడ్డి సేవలు మరువరానివని శ్లాఘిస్తూ ఆయన చదువుకున్న పాఠశాలలోనే తానూ చదువుకోవటం తనకు గర్వకారణమన్నారు. సంజీవరెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితాలు అందరికీ ఆదర్శప్రాయమని గవర్నర్ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more