కొండా దంపతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. తమ వర్గీయులపై సస్పెన్షన్ వేటు వేసింది.. వైసీపీ దెబ్బ ఏమిటో కొండా దంపతులకు చూపించింది. పార్టీలో తోక జాడించే నాయకులకు ఇది నిదర్శనం అంటూ పార్టీ నాయకులకు ఒక సందేశం పంపించారు. ఈ దెబ్బతో కొండా దంపతులు షాక్ తిన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ముఖ్యనేతల్లో ఒకరు కొండాదంపతులు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండా సురేఖ దంపతులు హావా బాగా సాగింది. వైఎస్ కుటుంబానికి దగ్గర బందువుల్లా కొండా దంపతులు ఉండేవారు. రాజశేఖర రెడ్డి మరణం తరువాత కూడా కొండా సురేఖ దంపతుల్లో ఎలాంటి మార్పు రాలేదు, వైఎస్ జగన్ అండగా ఉంటూ వచ్చారు. ఆ సమయంలో తన మంత్రి పదవిని సైతం లెక్కచెయ్యకుండా రాజీనామ చేసి.. వైఎస్ కుటుంబంపై ఉన్న భక్తిని చాటుకుంది.
జగన్ జైలు వెళ్లిన తరువాత కొండా సురేఖ దంపతుల పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దారుణంగా పడిపోయింది. సీనియర్ నాయకులు పార్టీలోకి వలసలు రావటం, వారి రాజకీయంతో కొండా సురేఖ దంపతులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే పార్టీ అధిష్టానం కూడా కొండా దంపతులను కొంచెం దూరంగా పెట్టినట్లు కొండా సురేఖ అభిమానులు చెబుతున్నారు. తెలంగాణలో వైసీపీ పార్టీకి బలమైన నాయకురాలిగా ఉన్న కొండా సురేఖ దంపతులపై పార్టీ అధిష్టానం వేటు వేయటానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల నుండి కొండా దంపతులు పార్టీ దూరంగా ఉంటూ, తమ రాజకీయ జీవితాన్ని ఏ పార్టీలో సాగించాలి అనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు వైసీపీ నాయకులు అంటున్నారు.
కొండా దంపతులకు , బిజేపీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కానీ కొండా సురేఖ చూపులు మాత్రం కాంగ్రెస్ వైపు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ కొండా దంపతులు మాత్రం ఎలాంటి ప్రకటనలు చెయ్యలేదు. ఇటీవల కొండా వర్గీయులు వరంగల్ జిల్లాలో పార్టీ కార్యాలయానికి తాళం వేయడమా పెద్ద వివాదంగా మారింది. ఇలా ఒక్కో వివాదమూ ముదిరి పాకాన పడిన, కొండా వర్గీయులపై పార్టీ వేటు వేసేలా చేసిందని.. వైసీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. వైసీపీలో వేటుపడ్డవారంతా తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణను కొండా దంపతులతో చర్చించి ప్రకటిస్తామంటున్నారు.
కొండా దంపతులతో పాటు సురేఖ వర్గానికి చెందిన నలుగురిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. మహిళా విభాగం, మైనార్టీ విభాగం, ట్రేడ్ యూనియన్, ఎస్సీ సెల్ అధ్యక్షులను వైసీపీ సెస్సెండ్ చేసింది. కొండా దంపతులపై కూడా త్వరలో చర్య తీసుకోవాటానికి పార్టీ అధిష్టానం సిద్దంగా ఉన్నట్లు వైసీసీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more