Criminal organisation with youth addicted to drugs

kidnap murder by youth, murder of tadipatri businessman, kurnool sp, tadipatri, kurnool district, vasuram prasad, vamshi medicla shop

criminal-organisation-with-youth-addicted-to-drugs

వ్యసనాలతో వక్రమార్గం

Posted: 04/30/2013 09:21 AM IST
Criminal organisation with youth addicted to drugs

చెడుచేయటానికి ప్రేరేపించేవి  వ్యసనాలే అని బాగా తెలిసిన ప్రొద్దుటూరు లోని ఆటో డ్రైవర్ సునీల్ కుమార్, సినిమా ఫక్కీలో తనదైన నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు.  కాలేజ్ లలో చదివే విద్యార్థులను వ్యసనాలకు గురిచేసి వాళ్ళతో నేరాలు చేయించటం మొదలుపెట్టాడు.  కడప, అనంతపురం జిల్లాలలో నేర కేంద్రాలను స్థాపించి, అందులో ఎక్కువగా ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులను చేర్చుకున్నాడు.  ఎక్కడికక్కడ స్థానికంగా ముఠాలు, ఎప్పటి కప్పడు సమాచారాలను అందించే గూఢచారులను కూడా తయారుచేసుకున్నాడు.  విచ్చలవిడిగా నేరాలకు పాల్పడటానికి బిజినెస్ మన్ సినిమా శైలిలో పకడ్బందీగా ఏర్పాట్లను చేసుకున్నాడు.  మొత్తం వందమంది వరకు ఇతని కింద పనిచేసేవారు తయారయ్యారు.

ఇంకేముంది, కార్యరంగంలోకి దూకారు.  ఫిబ్రవరి 17 న తాడిపత్రిలోని వాసూరాం ప్రసాదే అనే వంశీ మెడికల్ షాప్ యజమాని అపహరణకు పాల్పడ్డారు.  అతని దగ్గరున్న బంగారు గొలుసు, ఉంగరాలైతే వీళ్ళ చేతికి చిక్కాయి కానీ ఇంకా డబ్బు లాగుదామని చేసిన హింసాకాండలో వాసూరాం మరణించటం జరిగింది.  ఆ తర్వాత శవాన్ని గుర్తుపట్టకుండా ఉండటంకోసం పెట్రోల్ పోసి అంటించారు.

అయితే కాలిపోయిన మృత దేహం దగ్గర లభించిన తాళాలగుత్తి, చేతి గడియారం సాయంతో, వాసూరాం అదృశ్యమైనట్లుగా అందిన వాసూరాం కుమారుడి ఫిర్యాదు మూలంగా హత్యకేసుని నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా హంతకులను పట్టుకున్నారు.  ఈ నెల 11 న పట్టుకున్న నేరస్తులలో ఒకడైన అనిల్ వలన కథ మొత్తం బయటకు వచ్చింది.  దానితో 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘోరమైన విషయమేమిటంటే అరెస్టైన ఆ తొమ్మిదిమందిలో సూర అశోక్ కుమార్ రెడ్డి పేద విద్యార్ధి.  అపహరణ, అనంతరం హత్యకు గురైన వాసూరాం ప్రసాద్ అశోక్ కుమార్ రెడ్డిని ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివించారు.  అన్నం పెట్టి, విద్యాదానం చేసి, జీవితాన్నిచ్చిన కృతజ్ఞత కూడా లేకుండా అశోక్ కుమార్ రెడ్డి ఆయన్ను హతమార్చటంలో చేతులు కలిపాడంటే వ్యసనాలు మనిషిని ఏ స్థాయిలో మృగంగా మార్చివేస్తాయన్నది అర్థమౌతోంది.  కానీ యువత ఆ దారి పట్టటం మాత్రం బాధ కలిగిస్తోంది.  ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు దేశాన్ని పురోగతిలో నడిపించవలసినవారు తమ జీవితాలను పాడుచేసుకోవటమే కాకుండా సమాజానికి పట్టుకురుపులా తయారయ్యారన్నది దుఃఖాన్ని కలిగిస్తున్న విషయం. 

డోన్ పోలీస్ సబ్ డివిజన్ ఛేదించిన ఈ హత్యలోని నేర వివరాలన్నీ కర్నూల్ ఎస్పీ చంద్రశేఖర రెడ్డి, డోన్ డిఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి, ప్యాపిలి సిఐ రామకృష్ణా రెడ్డి, జలదుర్గం ఎస్సై జయన్నలు మీడియా సమావేశంలో తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more