ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం సాధించాలంటే సాయుధపోరాటం చెయ్యాలని, అందుకు విద్యార్థులంతా సాయుధులై పోరాటాన్ని సలిపి తెలంగాణాను సాధించుకోవలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పోస్టర్లను చూసి విద్యార్థులతో సహా అందరూ ఖంగుతిన్నారు. హాస్టల్ గోడల మీదా ఇతర ప్రదేశాలలో ప్రత్యక్షమైన ఈ పోస్టర్లు, ఇంతవరకు ఉద్యమంలో ముందున్న విద్యార్థులు ఇక ఆయుధాలపట్టి ముందుకెళ్తేనేగాని తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం జరగదంటూ ప్రకటిస్తున్నాయి.
ఐదు సంవత్సరాలుగా తెలంగాణా కోసం ఉద్యమం సాగిస్తున్నా ఇటువంటి హింసను ప్రేరేపించే పిలుపును ఇంతవరకూ ఎప్పుడూ చూడలేదని విద్యార్థులు అంటున్నారు. ఇది కచ్చితంగా బయటివాళ్ళు చేసిన పనేనని వాళ్ళు అన్నారు. ఆయుధాలతో పోరు సలిపే ఆలోచన విద్యార్థులకు లేదని, పైగా అటువంటి చర్యలు అసలుకే మోసం చేసి ఉద్యమానికి నష్టం కలిగిస్తుందని చెప్పిన ఒక సీనియర్ ప్రొఫెసర్, తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే వారికి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి వారి జీవితాలను పాడు చేసుకోవాలనే ఆలోచ విద్యార్థులకు లేనేలేదన్నారు. తెలంగాణా ఉద్యమాన్ని నీరుగార్చటం కోసం మావోయిస్ట్ లతో ముడిపెడుతూ ఇటువంటి ప్రచారాలా జరుగుతున్నాయని కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐకాస కూడా పోస్టర్లలోని పిలుపుని ఖండిస్తూ, ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నమెవరో చేస్తున్నారని అన్నారు.
ఈ ఘటన మీద పోలీసులు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఆ పని చేసిన సంస్థను తెలంగాణా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీగా గుర్తించారు కానీ అరెస్ట్ లేమీ చెయ్యలేదింకా అంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్స్ పెక్టర్ పి.అశోక్ తెలియజేసారు.అయితే ఆ సంస్థకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గరనుంచి .38 రివాల్వర్, 9 ఎమ్ఎమ్ రివాల్వర్, నాలుగు రౌండ్లను స్వాధీనం చేసుకున్నారని వార్త వినబడుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more