ఇది తెలుగు సంవత్సరాది కాబట్టి తెలుగువాళ్ళంతా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే వేడుకలు చేసుకుంటారు, ఆ వంకన మనం తెలుగువాళ్ళం అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఉగాదికి ప్రత్యేకత అన్ని రుచులను మేళవించి చేసే ప్రసాదం. దాన్ని తిన్నతర్వాతనే మరేదైనా తినాలనే ఆచారం అనాదిగా వస్తోంది. సంవత్సరం మొత్తంలో మిగతా రుచులను ఎప్పుడో ఒకప్పుడు రుచి చూస్తాం కానీ వేప రుచి మాత్రం చూడం. అందుకే ఉగాది పచ్చడి లోని వేప పువ్వు ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వేప పుల్లతో పళ్ళు తోముకోవటం మానేసిన దగ్గర్నుంచి వేప రుచి నాలికకు తగలటం మానేసింది. వేప లో ఉన్న ఔషధగుణాలు ఈ విధంగానైనా సంవత్సరానికి ఒక్కరోజు మన శరీరంలోకి చేరి మంచిచెయ్యటానికి చేసిన ఏర్పాటిది అని కూడా అనుకోవచ్చు.
అంతేకాదు. జీవితం షడ్రుచుల మేళవం అన్నది ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. జీవితమంతా ఒకేలా ఉండదు. ఆటుపోట్లుంటాయి. అందుకే ఉగాది పచ్చడిని పిల్లలకు పెట్టేటప్పుడు, వివిధ అనుభవాలతో వివిధ అనుభూతుల, వివిధ భావాల మిశ్రమమే జీవితం అన్న విషయాన్ని పెద్దలు మనకు చెప్తారు. కష్టాలు, సుఖాలు, ఆనందాలు, దుఃఖాలు, ఈ మధ్యలో ఎన్నో స్థాయిల్లో ఎన్నో అనుభూతులు- ఇదే జీవితమంటే.
పెద్దలు మనకు చెప్పే మరో విషయం, ఈ రోజు సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఈ రోజు చేపట్టిన కార్యం విజయవంతమౌతుందని, ఈ రోజు చేసే పనులకు సంవత్సరం మొత్తం మీద ఆటంకం ఉండదు కాబట్టి మీరు చెయ్యవలసిన పనులనన్నిటినీ ఈరోజు తప్పకుండా చెయ్యమని చెప్తారు. అన్ని పండుగలకూ ఆటవిడుపే ప్రత్యేకతైతే, ఈ పండుగలో ఆ విధంగా కార్యాచరణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉదయం లేవగానే మన మనస్సుని ఆహ్లాదంగా ఉంచుకుని, చెయ్యవలసిన విధులను సకాలంలో చెయ్యటానికి పూనుకుంటే రోజంతా అన్ని పనులూ చక్కగా జరిగిపోవటమే కాకుండా, పనులన్నీ అయిపోయి సేదతీరేటప్పుడు ఆనందంతో మనసంతా హాయి చోటుచేసుకుంటుంది. అలాగే సంవత్సరం మొదట్లో బద్ధకానికి తావివ్వకుండా, చక్కగా శ్రద్ధగా మన పనుల మీద ధ్యాస పెట్టుకుని వాటిని చేసుకుంటే, సంవత్సరమంతా అలాగే హాయిగా సాగిపోతుందని పెద్దలు మనకు సూచించారు.
ఇక పండుగ కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, తలంటుపోసుకోవటం, నూతన వస్త్రాలు ధరించటం, పిండివంటలు, షడ్రసోపేతమైన భోజనం- ఇవన్నీ ఎలాగూ ఉంటాయనుకోండి. కానీ దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకు భిన్నంగా ఆటలు, పందాలు, బయట తిరగటాలు లాంటివి కాకుండా, ఇంటిల్లిపాదీ కలిసి గడపటం, ఎవరి ధర్మాలను వారు నిర్వర్తించటం ఉగాది పండుగ ప్రత్యేకత.
ఏ పనులకైనా ప్రణాళికనేది చాలా ముఖ్యం. కాగితం మీద వేసే ప్రణాళికలు కూడా అవసరమే కానీ, ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగిన తర్వాత వచ్చే ఆలోచనలు, అప్పుడు చేసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి. అందుకే ఉగాది నాడు ఏం చేస్తే సంవత్సరమంతా ఆ పనులు చేస్తుంటారు అని చెప్తూ కార్మోన్ముఖులను చేస్తారు. ఆ రోజు ఎంత పని చేసారన్నది ముఖ్యం కాదు. ఆరోజు ఏయే పనులతో మీ మనసంతా నిండివుంది, ఏ కార్యక్రమాలు మీ మనసులో రూపుదిద్దుకున్నాయి, ఏ ప్రణాళికలు మీ దృష్టిని ఆకర్షించాయి. ఏ లక్ష్యం మిమ్మల్ని ప్రేరేపిస్తూ మీలో తిష్టవేసింది అన్నవి మాత్రమే ప్రధానమైనవి.
అందుకే ఈరోజు మరో ముఖ్యమైనకార్యక్రమం- పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరికి ఎలా ఉండబోతోంది, సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎటువంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది అన్నది కూడా పంచాంగ కర్తలు మనకు వివరిస్తారు.
జరగేది ఎలాగూ జరుగుతుంది కదా మరి దాన్ని తెలుసుకుని ఏం చేస్తాం అనే వా కొందరుంటారు. కానీ తెలుసుకోవాలనే ఉత్సాహం చూపించేవారే చాలామంది ఉంటారు. అలా తెలుసుకోవాలనుకునేవారు రెండు రకాలు. కార్యశీలులు, బద్ధకస్తులు. మంచి జరుగుతుంది అని చెప్పారనుకోండి, కార్యశీలత ఉన్నవాళ్ళయితే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. అదే బద్ధకస్తులైతే, ఎలాగూ మంచి జరగేది రాసిపెట్టుందికదా ఇక నేనుగా చెయ్యకపోతేనేం అనుకుంటారు. చెడు ప్రభావం ఉండే అవకాశం ఉంది అని చెప్పారనుకోండి, కార్యశీలతగలవాళ్ళు అలాగైతే ఇంకా శ్రద్ధగా పనిచేసి ఆ చెడు ని అధిగమించాలని అనుకుంటారు. అదే బద్ధకస్తులైతే, ఎలాగూ చెడు జరగబోతోంది కదా ఇక పనిచేసి ఆయాసం మిగుల్చుకోవటం దేనికి అని అనుకుంటారు. అందుకే భవిష్యత్తు తెలుసుకోవటం పనిచేసే వాళ్ళకే మేలు చేస్తుంది.
సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొంటే, ముందుగానే ఉదయాన్నే కార్మోనుఖులవమని చెప్పటానికి అదే కారణం. పూర్వకాలం పంచాంగ శ్రవణం సాయంత్రం వేళలోనే ఉండేది. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ కానిచ్చుకుని సాయంత్రం దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని అక్కడ ఆలయ యాజమాన్యం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రద్ధగా వినటానికి కూర్చునేవారు.
విజయోస్తు.
ఈ విజయనామ సంవత్సరం మీ అందరికీ విజయాలను సాధించాలని మనసారా కోరుకుంటూ ఆంధ్రవిశేష్, తెలుగు విశేష్ తరఫునుంచి మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ -శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more