రాష్ట్రంలో అనేక మంది జైల్లో ఉన్న వ్యక్తులను నమ్ముతూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నారని, వారికి కష్టాలు తప్పవనే విషయాన్ని గుర్తించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పదవుల కంటే ప్రజాసంక్షేమమే ముఖ్యమనే సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేయటం గర్వంగా ఉందన్నారు. ఇతర పార్టీల్లో స్వలాభం కోసం పనిచేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారన్నారు. తోక పట్టుకొని గోదావరి ఈదేందుకు ప్రయత్నిస్తున్న వారు మధ్యలోనే మునిగిపోతారని అన్నారు. గెలుపోటములు ఎవరి చేతుల్లోనో లేవని, ప్రజల మద్దతు కూడగట్టుకొని క్రమశిక్షణతో ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా పనిచేయాలని, తద్వారా రాహుల్, సోనియాల నాయకత్వాన్ని బలపర్చాలని ఆమె కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంపై నాయకులు దృష్టి పెట్టాలన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే వారికే పార్టీ టిక్కెట్లు దక్కుతాయనే విషయాన్ని గమనించాలని రేణుకా చౌదరి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వారి సంఖ్య తగ్గిందని, స్వలాభం కోసం పనిచేసే వారు ఎక్కువయ్యారని, వారికి పార్టీపరంగా ఎలాంటి లబ్ధి జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేసి వారి మద్దతు పొందాలని హితవు పలికారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్ని మండలాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత రేణుకదేనని, ఇదే ఐక్యతతో కాంగ్రెస్ను గెలిపించుకుంటామని అన్నారు. ఓటు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని, రోజుకో మాట చెప్పే పార్టీలకు లేదని ఆయన స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more