ప్రజల ఆకాంక్షను బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. కొత్త ప్రాజెక్టులు, రైళ్ల డిమాండ్లు ఎన్నో ఉన్నాయని బన్సాల్ ముందుగానే ప్రకటించారు. 2001లో రూ.4,955 కోట్ల రైల్వే నష్టాలు, 2012 నాటికి రూ.24,600 కోట్లకు పెరిగాయన్నారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో లక్ష కోట్ల పనులు అమలు చేయాలనుకుంటున్నామని బన్సాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రయాణికులపై ఛార్జీలు పెరగవని ఆయన ప్రకటించారు. అలాగే టికెట్ బుకింగ్ను 'ఆధార్'తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రత్యేక రైళ్ళకు మహిళా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయన్నుట్లు బన్సాల్ స్పష్టం చేశారు. ఆర్పీఎఫ్లో ఇకపై మహిళలకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పాలకపక్ష సభ్యులు ఈ ప్రకటనకు తమ కరతాళధ్వనులతో ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ప్రయాణ ఛార్జీల ఆదాయ లక్ష్యం రూ.32,500 కోట్లుగా రైల్వేశాఖ మంత్రి బన్సల్ తెలిపారు. ఆర్థిక క్రమ శిక్షణతో ఖర్చులను తగ్గించుకున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే కేంద్రంపై ఆధారపడకుండా నిధులు సమకూర్చుకుంటామని బన్సల్ వెల్లడించారు. మొదటిసారి 347 కొత్త ప్రాజెక్టులకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. కుంభమేళా సమయంలో అలహాబాద్ రైల్వే స్టేషన్లో ప్రమాదం సంభవించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ప్రమాద నివారణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. లెవల్ క్రాసింగ్ వద్ద 40 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, కాపలా లేని లెవల్ క్రాసింగ్లు లేకుండా చేయడానికి రూ.37 వేల కోట్లు కావాలని రైల్వే మంత్రి చెప్పారు. భవిష్యత్లో మరింతగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని మంత్రి తెలిపారు.రైల్వే ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టమ్ను కూడా త్వరలో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.
బడ్జెట్లో ముఖ్యాంశాలు :
1. కాలం చెల్లిన 17 రైల్వే బ్రిడ్జ్ల స్థానంలో ఈ ఏడాది కొత్తగా వంతెనలు
2. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఎనిమిది కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.
3. మెట్రో నగరాల లోకల్ రైళ్లలో మహిళా బోగీల్లో మహిళా పోలీసులు.
4. కేంద్రీకృత కేటరింగ్ వ్యవస్థకై టోల్ఫ్రీ నంబర్ను మొదలు పెట్టాం.
5. విశాఖలో పర్యాటకుల కోసం లగ్జరీ లాంజ్.
6. విద్యార్థులకు భారత చరిత్రను వివరించేందుకు రైల్వే కృషి
7. చారిత్రక ప్రదేశాల పర్యటనకు ఆజాద్ ఎక్స్ప్రెస్.
8. ఆజాద్ ఎక్స్ప్రెస్లో విద్యార్థులకు రాయితీ.
9. సరిహద్దులో రైల్వేలైన్లు అత్యంత ప్రాధాన్యం.
10. రాజస్థాన్ - భిల్వాడలో మెమో కోచ్ ఫ్యాక్టరీ.
11. ఆర్పీఎఫ్లో ఇకపై 10 శాతం మహిళలు.
12. ఎంపిక చేసిన రైళ్లలో అత్యంత విశాలవంతమైన కోచ్లు.
13. ప్రధాన రైళ్లలో ఉచిత వైఫై సౌకర్యం.
14. టికెట్ బుకింగ్ ఆధార్తో అనుసంధానం
15. వికలాంగులు, వృద్ధుల కోసం 179, 400 లిఫ్టులు.
16. రైల్వే స్టేటస్ను చెప్పే ఎస్ఎమ్ఎస్ వ్యవస్థ
17. నాణ్యమైన, శుభ్రమైన ఆహారం కోసం చర్యలు.
18. రాయబరేలీలో కోచ్ ఫ్యాక్టరీ, ఇప్పాత్ నిగమ్తో ఒప్పందం.
19. రైల్వేలో ఈ ఏడాది లక్షన్నర ఉద్యోగాలు భర్తీ.
20. రైల్వేలో సౌర, పవన విద్యుత్ వినియోగానికి ప్రాధాన్యం.
21. రైల్వేల్లో ఇకపై గ్రీన్ ఎనర్జీ.
22. ఒలింపిక్ పతక విజేత లకు, ద్రోణాచార్య కోచ్లకు రైల్వేల్లో ప్రత్యేక పాస్లు.
23. స్వాతంత్య్ర సమర యోధుల పాసులు మూడేళ్లకోసారి రెన్యువల్.
24. ఆర్థిక క్రమశిక్షణకు అగ్రతాంబూలం
25. ప్రభుత్వాన్ని ఈ ఏడాది అదనపు నిధులు అడగడం లేదు.
26. ఈ ఏడాది ప్రయాణికులపై చార్జీల మోత లేదు.
27. రైల్వేకు ఉపాధి హామీ అనుసందానం.
28. సూపర్ ఫాస్ట్ రైళ్లలో రిజర్వేషన్, క్యాన్సిలేషన్ చార్జీల పెంపు.
29. సరుకు రవాణా చార్జీలు ఐదు శాతం పెంపు.
30. ఇండిపెండెంట్ టారిఫ్ రెగ్యులేటరీ అథారిటీ ప్రతిపాదన.
31. ఈ ఏడాది 12 వందల కి.మీ విద్యుదీకరణ
32. 2013-14లో 500 కి.మీ కొత్త లైన్లు, 750 కి.మీ డబ్లింగ్ లక్ష్యం.
33. పుణ్యక్షేత్రాల కోసం కొత్త రైళ్లు.
34. కొత్తగా 27 ప్యాసింజర్ రైళ్లు, 67 ఎక్స్ప్రెస్ రైళ్లు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more