ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రతం వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పై ప్రముఖు స్పందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సైతం కమల్ తో తమకు విభేదాలు లేవని చెప్పటం జరిగింది. శాందిభద్రతల కారణంగానే సినిమాను నిలిపివేయటం జరిగిందని జయలలిత చెప్పటం జరిగింది. అయితే ఈరోజు వివాదాల్లో చిక్కుకున్న 'విశ్వరూపం' చిత్రంపై తమిళనాడు గవర్నర్ రోశయ్య స్పందించారు. ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చిత్ర నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సున్నిత అంశాల విషయంలో నిర్మాతలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రారంభమయిన తమిళాడు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ రోశయ్య ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చిత్ర నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ‘విశ్వరూపం’ చిత్రంపై చర్చలు ప్రారంభమయ్యాయి.
హోంశాఖ సెక్రటరీ అధ్యక్షతన చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో కమల్హాసన్ సోదరుడు, ముస్లిం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల పట్ల ముస్లిం వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, తమిళనాడు ప్రభుత్వం సినిమాను నిషేధించిన నేపథ్యంలో బిజెపి నేతలు సినిమాను చూడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే విడుదల కాగా హిందీ వర్షన్ ఈ రోజు విడుదలయింది. మిగిలిన పలు భాషల్లో ఆ సినిమా విడుదలయింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం ససేమీరా అంటోంది. అయితే ఈ రోజు జరుపుతున్న చర్చలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more